Karimnagar: కరీంనగర్ జిల్లాలో కన్నకూతురు కిడ్నాప్ కలకలం రేపింది. కన్న కూతిరిని కిడ్నాప్ చేయడానికి యత్నించారు తల్లిదండ్రులు. పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, రాజక్కపల్లెకు చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. రాకేష్ది వేరే కులం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. వాళ్ల ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఎదిరించి జులై 27న వివాహం చేసుకున్నారు. అయితే ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్ లో చూపిస్తామని తల్లి నమ్మించి హాస్పిటల్లో చూపించి తిరిగి వస్తుండగా ప్రియాంక తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకొని.. పోలీసులు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు, తన భర్త రాకేష్ కు ప్రాణ హాని ఉందని పోలీసులకు తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.