E-Paper
Advertisement

Inter Exams IN AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! 10 లక్షల మందికి పైగానే

Inter Exams IN AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! 10 లక్షల మందికి పైగానే

Inter Exams IN AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీయట్ పరీక్షలు-2026 సోమవారం నుంచి మొదలయ్యాయి.  మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల కోసం ఏపీ వ్యాప్తంగా 1,500 లకు పైగానే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈసారి 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

ఏపీలో ఇంటర్ పరీక్షలు.. 10.57  లక్షల మంది హాజరు

ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో 5.31 లక్షల మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. మరో 5.26 లక్షల మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇంటర్ సెకండియర్ పరీక్షలు మంగళవారం నుంచి జరుగుతాయి. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచన చేశారు అధికారులు. పరీక్షలు జరిగే అన్ని గదు­ల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఓ నిఘా కెమెరాలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఉమ్మడి కృష్ణా జిల్లా ఈసారి సుమారు 1.02 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 56 వేల మంది విద్యార్థులు ఫస్టియర్ విద్యార్థులు కాగా, 46 వేల మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. గతేడాది ఈ జిల్లా రాష్ట్రంలో అత్యధికంగా 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది.

ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 150కి పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్ వంటి గాడ్జెట్స్‌ని దూరంగా పెట్టారు. పరీక్షలు జరిగే కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.ఇప్పటికే అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ALSO READ: పోస్టల్ వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం.. వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానం

ఎండలు మొదలు కావడంతో ప్రతి కేంద్రంలో తాగునీరు, ప్రాథమిక చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సందేహాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబర్ 1800–425–1531 సంప్రదించవచ్చు.

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×