E-Paper
Advertisement

Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టు పూర్తి పై.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టు పూర్తి పై.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy: 2027 డిసెంబర్ మాసంతానికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరుతో పాటు తాగు నీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదులతో పాటురాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లకు అవసరమైన భూసేకరణను జూన్ 2 నాటికి పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సీఎం అధ్యక్షతన ప్రాజెక్టు వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జూన్ 2 నాటికి పూర్తి..

2001 లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్న 2026 నాటికి అనుకున్న పురోగతి సాధించ లేక పోయిందన్నారు. సొరంగ మార్గంతో పాటు పంప్ హౌస్ లలో ఎదురౌతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సరించించందన్నారు. దేవాదులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను జూన్ 2 నాటికి పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకు అవసరమైన నిధులను విడుదలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమనిఅన్నారు.

Advertisement

Also Read: Action Thriller movie :17 ఏళ్లకే గ్యాంగ్ స్టర్… ఒళ్ళు జలదరించేలా ఒక్కో సీన్… అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్

అసత్య ప్రచారం..

గోదావరి జలాశయాలలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాలలో తెలంగాణా వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయన్నారు. అటు ట్రిబ్యునల్,కే.ఆర్ ఎంబీ,సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి ప్రచారాలను త్రిప్పి కొట్టడంతో పాటు తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

Advertisement

Also Read: This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పూనకాలే..!

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×