E-Paper
Advertisement

Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టు పూర్తి పై.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టు పూర్తి పై.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: 2027 డిసెంబర్ మాసంతానికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరుతో పాటు తాగు నీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదులతో పాటురాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లకు అవసరమైన భూసేకరణను జూన్ 2 నాటికి పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సీఎం అధ్యక్షతన ప్రాజెక్టు వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జూన్ 2 నాటికి పూర్తి..

2001 లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్న 2026 నాటికి అనుకున్న పురోగతి సాధించ లేక పోయిందన్నారు. సొరంగ మార్గంతో పాటు పంప్ హౌస్ లలో ఎదురౌతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సరించించందన్నారు. దేవాదులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను జూన్ 2 నాటికి పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకు అవసరమైన నిధులను విడుదలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమనిఅన్నారు.

Also Read: Action Thriller movie :17 ఏళ్లకే గ్యాంగ్ స్టర్… ఒళ్ళు జలదరించేలా ఒక్కో సీన్… అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్

అసత్య ప్రచారం..

గోదావరి జలాశయాలలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాలలో తెలంగాణా వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయన్నారు. అటు ట్రిబ్యునల్,కే.ఆర్ ఎంబీ,సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి ప్రచారాలను త్రిప్పి కొట్టడంతో పాటు తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

Also Read: This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పూనకాలే..!

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×