E-Paper
Advertisement

Jagan : సింగిల్ గానే వస్తా.. చంద్రబాబు, పవన్ కు జగన్ సవాల్..

Jagan : సింగిల్ గానే వస్తా.. చంద్రబాబు, పవన్ కు జగన్ సవాల్..
Advertisement

Jagan : ఏపీ సీఎం జగన్ .. చంద్రబాబు పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగనన్న చేదోడు మూడో విడత నిధులను వినుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. అదే సమయంలో పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. అదే విధంగా టీడీపీ, జనసేనపై ఘాటు విమర్శలు చేశారు.

రాష్ట్రంలో తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని జగన్ మండిపడ్డారు. సింహంలా మీ బిడ్డి సింగిల్ గానే ఎన్నికల సమరంలోకి దిగుతాడని ప్రజలకు స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలను నమ్మనని తేల్చిచెప్పారు. ప్రజలపైనే తనకు విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి పెత్తందారీ మధ్య పోటీగా పేర్కొన్నారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా? తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.

Advertisement

రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని స్పష్టం చేశారు. గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేసిందని ఆరోపించారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గజదొంగల ముఠా అని ఆరోపించారు. టీడీపీ హయాంలో డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సభలో జగన్ …జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు టీడీపీ కలిసిపోయారని విమర్శించారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×