BigTV English

Jagan: ఎక్స్‌లో జగన్ మాట.. మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ

Jagan: ఎక్స్‌లో జగన్ మాట.. మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ

Jagan: ప్రతిష్టాత్మకమైన లండన్‌లో కింగ్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది మాజీ సీఎం జగన్ కుమార్తె వర్షారెడ్డి. డిస్టింక్షన్‌లో కూతురు పాస్ కావడంతో ఆ తల్లిదండ్రులు ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా బయటపెట్టారు. మమ్మల్ని గర్వపడేలా వర్ష చేసిందని పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా అభినందలు తెలియజేశారు.


ప్రపంచంలో ఫేమస్సయిన కాలేజీల్లో లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఒకటి. అందులో ఫైనాన్స్ విభాగంలో పట్టా అందుకుంది వర్ష. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రస్తావించారు జగన్. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను షేర్ చేశారు మాజీ సీఎం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది.

వర్ష స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు న్యాయస్థానం అనుమతితో జగన్‌ తన భార్యతో కలిసి ఐదు రోజుల కిందట లండన్‌ వెళ్లారు. జనవరి నెలాఖరులో జగన్ తిరిగి విజయవాడకు రానున్నారు.


ఇక జగన్ పెద్ద కూతురు హర్ష‌రెడ్డికి అద్భుతమైన రికార్డు ఉంది. 2017లో ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేరింది. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ (UG) పూర్తి చేసింది. ఆ తర్వాత యూఎస్‌లోని ఓ ఫైనాన్షియల్ కంపెనీలో ఆమె చేరిన విషయం తెల్సిందే.

 

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×