E-Paper
Advertisement

Jagan: ఎక్స్‌లో జగన్ మాట.. మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ

Jagan: ఎక్స్‌లో జగన్ మాట.. మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ

Jagan: ప్రతిష్టాత్మకమైన లండన్‌లో కింగ్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది మాజీ సీఎం జగన్ కుమార్తె వర్షారెడ్డి. డిస్టింక్షన్‌లో కూతురు పాస్ కావడంతో ఆ తల్లిదండ్రులు ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా బయటపెట్టారు. మమ్మల్ని గర్వపడేలా వర్ష చేసిందని పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా అభినందలు తెలియజేశారు.

ప్రపంచంలో ఫేమస్సయిన కాలేజీల్లో లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఒకటి. అందులో ఫైనాన్స్ విభాగంలో పట్టా అందుకుంది వర్ష. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రస్తావించారు జగన్. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను షేర్ చేశారు మాజీ సీఎం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది.

వర్ష స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు న్యాయస్థానం అనుమతితో జగన్‌ తన భార్యతో కలిసి ఐదు రోజుల కిందట లండన్‌ వెళ్లారు. జనవరి నెలాఖరులో జగన్ తిరిగి విజయవాడకు రానున్నారు.

ఇక జగన్ పెద్ద కూతురు హర్ష‌రెడ్డికి అద్భుతమైన రికార్డు ఉంది. 2017లో ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేరింది. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ (UG) పూర్తి చేసింది. ఆ తర్వాత యూఎస్‌లోని ఓ ఫైనాన్షియల్ కంపెనీలో ఆమె చేరిన విషయం తెల్సిందే.

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×