యువగళంతో మార్పు చూపించిన నారా లోకేష్, కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు ప్రభుత్వంలో నారా లోకేష్ కూడా చొరవగా పనిచేస్తున్నారు. అదే సమయంలో ఆయన టీడీపీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరించి ఆ తర్వాతే ఇంటికి వెళ్లారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నాలుగు గంటల పాటు దాదాపు 4 వేలమందికి పైగా కలిసి వారి సమస్యలను మంత్రి స్వయంగా తెలుసుకున్నారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి, పరిష్కరించాలని సిబ్బందికి… pic.twitter.com/1sa0CT2N5t
— Telugu Desam Party (@JaiTDP) November 4, 2025
4వేలమంది..
అధికారంలో లేనప్పుడు ఎన్నివేలమందినైనా ఒకేరోజులో కలుస్తుంటారు నేతలు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా అపాయింట్ మెంట్ లు కరువవుతుంటాయి. అలాంటిది ఒకే రోజు 4వేలమందితో వన్ టు వన్ ఇంటరాక్షన్ అంటే మాటలు కాదు. 4వేలమంది వచ్చినా కూడా లోకేష్ మధ్యలో వెనుదిరగలేదు. అందరినీ కలసి, వారి సమస్యలు విని, పరిష్కారం దిశగా హామీ ఇచ్చి పంపించారు. వచ్చిన ప్రతి ఒక్కరితో ఫొటో దిగారు. దాదాపు 4 గంటలకు పైగా ఈ కార్యక్రమం కొనసాగింది.
ప్రజా దర్బార్ అనే పేరుతో నాయకులు వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమాలు చాలానే చూస్తుంటాం. ఒకరిద్దరు, లేదా ఒక 10మంది దగ్గర అర్జీలు తీసుకుని, తర్వాత వారందర్నీ గ్రూపుగా ఒక చోటకు చేర్చి అధికారులు, లేదా నాయకులతో వాటిని సేకరిస్తారు. ఆ తర్వాత గ్రూప్ గా అందరికీ అధినాయకుడు ఒకేసారి హామీ ఇస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. లోకేష్ ఓపికగా అందరి సమస్యలు విడివిడిగా విన్నారు. అందర్నీ విడివిడిగానే కలసి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ కార్యక్రమం నుంచి వెనుదిరిగారని అంటున్నారు. సమస్య పరిష్కారం అయ్యేది తర్వాతే అయినా, ముందుగా లోకేష్ నుంచి ఆ స్థాయిలో భరోసా లభించిందని, అది చాలని చాలామంది అంటున్నారు. వారందరి సంతోషమే తమ పార్టీకి శ్రీరామ రక్ష అంటున్నారు టీడీపీ నేతలు.
కష్టం చెప్పుకుంటే కరిగిపోయే మనసు ఒకటి ఉందన్న నమ్మకం ఉంది కాబట్టే ఇన్ని ప్రయాసలకు ఓర్చి జనం ప్రజాదర్బారుకు వస్తున్నారు. లోకేష్ గారికి చెప్పుకుంటే కష్టం తీరినట్టే అన్న భరోసా వాళ్ళను ఇంతదాకా తీసుకొస్తోంది. కన్నీటి తడి నిండిన కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించే అవకాశం తనకు దొరకడమే మహా… pic.twitter.com/yUtUjSJ3Wd
— Telugu Desam Party (@JaiTDP) November 4, 2025
ఓవైపు మంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోవైపు పార్టీ కార్యాలయంలో నిత్యం నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు లోకేష్. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇలాంటి పనులు అస్సలు చేయలేదనే విమర్శలు వైసీపీ నుంచే వినపడేవి. కనీసం పార్టీ నేతల్ని కలిసేవారు కాదని, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్లు దొరికేవి కాదని అంటుంటారు. కానీ లోకేష్ ఆ తప్పు చేయడం లేదని, నిత్యం పార్టీ నేతలకు, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారని, ప్రభుత్వం తమకు అండగా ఉందనే భరోసా వారికి కల్పిస్తున్నారని చెబుతున్నారు.
సమస్యల ఏకరువు..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు అన్యాయం జరిగిందని, ఇప్పుడైనా న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా బాధితులు కొందరు లోకేష్ ప్రజా దర్బార్ లో విన్నవించుకున్నారు. టీడీపీ సానుభూతిపరులనే ముద్ర పడటంతో అన్యాయంగా తమ పొలాలు లాగేసుకున్నారని, ఉద్యోగాల్లో తమను ఇబ్బంది పెట్టారని చాలామంది లోకేష్ కి ఫిర్యాదు చేశారు. వారందరికీ అండగా ఉంటామని లోకేష్ మాటిచ్చారు.
Also Read: అప్పుడు పరదాల్లో, ఇప్పుడు పొలాల్లో.. ఏంటి జగన్ ఇది!