E-Paper
Advertisement

Sitams College: చిత్తూరులో తీవ్ర విషాదం.. మూడో అంతస్తునుంచి దూకి.. విద్యార్ధి మృతి

Sitams College: చిత్తూరులో తీవ్ర విషాదం.. మూడో అంతస్తునుంచి దూకి.. విద్యార్ధి మృతి
Advertisement

Sitams College:  చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీతమ్స్ కాలేజిలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎగ్జామ్ సమయంలో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రుద్ర మూర్తి. ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మృతుడు కుటుంబ సభ్యులు కాలేజీ వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే తమ కొడుకు మరణించాడని ఆరోపించారు. రుద్ర మూర్తి కు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు అని తెలిపారు. న్యాయం కోసం యాజమాన్యం ప్రశ్నించేందుకు వెళ్లిన మృతుడి బంధువులను సీఐ నిత్యబాబు తోసేశారు. దీంతో ఘటన పై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. కాలేజీ ఎదుట నిరసన తెలిపారు. గత నెల 30న ఇదే కాలేజీలో చదువుకునే ఒ విద్యార్ధిని సూసైడ్ చేసుకోవడంతో.. వారం రోజుల వ్యవధిలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×