E-Paper
Advertisement

Jagan Talk with Raghurama: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, జగన్‌‌తో రఘురామ మాటలు, ఆయన పక్కనే..

Jagan Talk with Raghurama: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, జగన్‌‌తో రఘురామ మాటలు, ఆయన పక్కనే..

Jagan talks with Raghuramakrishnaraju: రాజకీయాల్లో శాశ్వత శత్రువు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు .. ఎప్పుడు.. ఎందుకు కలుస్తారో ఎవరికీ తెలీదు. బద్దశత్రువు ఒక్కసారిగా కలిస్తే మాటల్లో వర్ణించలేము. అలాంటి సన్నివేశం ఒకటి సోమవారం ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నేరుగా వెళ్లి జగన్ దగ్గర మాట్లాడడం ఇవాళ సభలోకి ఆసక్తికర పరిణామం.

సోమవారం అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం మొదలైం ది. ఆయన స్పీచ్ తర్వాత అనుకోని సన్నివేశం సభలో చోటు చేసుకుంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘు రామక‌ృష్ణరాజు వైసీపీ అధినేత జగన్‌ను పలకరించడం ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం వద్దకు వెళ్లిన రఘురామ, ఆయనను పలకరించారు. కొన్ని నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు.

ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఇకపై అసెంబ్లీకి రెగ్యులర్ వస్తానని, మీరే చూస్తారుగా అంటూ బదులి చ్చారు జగన్. దీని తర్వాత ఇరువురు నేతలు పైకి నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కనిపించింది. ఈ క్రమంలో రఘురామను పలకరించారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

ALSO READ:  నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్

జగన్-రఘురామరాజు మధ్య ఏం చర్చ జరిగిందన్న కుతూహలం సభ్యుల్లో నెలకొంది. జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరారు ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు. అసెంబ్లీ హాల్‌‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. దీంతో ఆయన నవ్వుతూ అలాగే అంటూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఐదేళ్ల తర్వాత ఇరువురు నేతలు అసెంబ్లీలో నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించడం కొనమెరుపు.

అన్నట్టు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనను హత్య చేయించాలని చూశారని ఇటీవలే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు పెట్టారు. పోలీసులూ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై రేపోమాపో జగన్‌ని ఆయన్ని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×