E-Paper
Advertisement

జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు.. బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు

జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు.. బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు
Advertisement

Bengaluru: వైసీపీ మీడియా కార్యదర్శి శ్రీహరికి కష్టాలు తప్పలేదా? సుప్రీంకోర్టు పిటిషన్ తోసిపుచ్చిన తర్వాత ఏపీ నుంచి బెంగుళూరు ఎందుకు వెళ్లారు? అక్కడి నుంచి ఎస్కేప్ కావాలని భావిస్తున్నారా? ముందుగానే కుప్పం పోలీసులు ఆయన్ని పసిగట్టారా? బుధవారం హైకోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తుందా? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి.

జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు

Advertisement

వైసీపీ మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని ఇవాళ కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు పోలీసులు. శ్రీహరి పెట్టుకున్న పిటిషన్‌ బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది.  పిటిషన్ విచారణ సమయంలో ఆయన బెంగుళూరులో ఎందుకు ఉన్నారన్నది అసలు ప్రశ్న.

ఈ కేసు విషయమై మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  ఈలోగా ఆయన విజయవాడ నుంచి బెంగుళూరుకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఈనెల 15న విజయవాడలో కుప్పం పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు

ఆయనతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త గిరీష్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే. ఈనెల 15న పూడి శ్రీహరిని విజయవాడలో అరెస్టు చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు కుప్పం పోలీసులు.

మేజిస్ట్రేట్‌ కోర్టు శ్రీహరి జ్యుడిషియల్‌ రిమాండ్‌ను తిరస్కరించడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీంత కుప్పం కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆయనకు అక్కడ ఊరట లభించలేదు.  ఇదిలావుండగా శ్రీహరి పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయనకు అనుకూలంగా రాకుంటే ఏంటని నేతలు మాట్లాడుకుంటున్నారు.

ALSO READ: తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×