KA Paul: తెలుగు రాష్ట్రాల్లో అప్పులు, నిరుద్యోగం పెరిగిపోయాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే విదేశీ పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు తెచ్చి, ఉచిత విత్తనాలతో వ్యవసాయాన్ని పండుగలా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమెరాకాలో ఉన్న నేను బిజీగా ఉన్నానని చెప్పారు.
ప్రో, నాగేశ్వరావు పై కేసులు నమోదు చేయడం మంచిది కాదని అన్నారు. ఆయన అందరికోసం మాట్లాడే వ్యక్తి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే అవకాశం ఎవరికి లేదా అని అన్నారు. అమిత్ షా దీనిపై స్పందిస్తారని అన్నారు. గతంలో నేను చాలా సార్లు ఆయనను కలిసానని అన్నారు. మీ అందరి సబ్జెక్టుపై మాట్లాడుకున్నామని అన్నారు. అమితా ఓక పెద్ద లీడర్ అని అన్నారు. ఆయన కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు.
Also read: రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?
అమిత్ షా మీకు ఈ విషయంలో ఎదో ఓక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. రాజకీయంలో మీరు తండ్రి లాంటి వారని అలాంటి వారు మీరే యువ నాయకుల్లా ఉగిపోతూ.. నోరు పారేసుకుంటే మీకు జగన్ మోహన్ రెడ్డికి తేడా లేకుండా పోతుందని అన్నారు. ఇలా మాట్లాడటం వలన మీకు పార్టీకి ఎంతో నష్ట్రం అని అన్నారు. తక్షనమే ఫ్రోఫెసర్ నాగేశ్వర్ రావు పై పెట్టిన కేసులు విరమించుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. నిందనలనుడ వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో అప్పులు, నిరుద్యోగం పెరిగిపోయాయి: కేఏ పాల్
తెలుగు రాష్ట్రాల్లో అప్పులు, నిరుద్యోగం పెరిగిపోయాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ.. ప్రజాశాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే విదేశీ… pic.twitter.com/m3aidPIJXR
— BIG TV Breaking News (@bigtvtelugu) May 25, 2026
Also read: Fuel Prices: బిగ్ బ్రేకింగ్.. నాలుగోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు