BigTV English

Kanna Laxminarayana : బీజేపీకి కన్నా రాజీనామా..! దారెటు..?

Kanna Laxminarayana : బీజేపీకి కన్నా రాజీనామా..! దారెటు..?

Kanna Laxminarayana : ఏపీలో బీజేపీ బలపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ పార్టీ విస్తరణకు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. చెప్పుకోదగ్గ నేతలు పార్టీలో లేరు. రాజకీయ కార్యక్రమాలు చురుగ్గా సాగడంలేదు. ఉన్న కొందిమంది నేతల మధ్య ఆధిపత్య పోరు కాషాయ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా కాషాయ పార్టీలో అగ్గిరాజేసింది.


ఉప్పునిప్పులా..
కొంతకాలంగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు అసలు పడటంలేదు. ఒకరి అభిప్రాయాలను మరొకరు విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలు కన్నా దూరంగా ఉంటున్నారు.

జీవీఎల్ తో విభేదాలు..
మరోవైపు ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కన్నాకు పొసగడంలేదు.జీవీఎల్ ఇప్పటికే పార్లమెంట్ లో కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఏపీలో ఓ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని పార్లమెంట్ వేదికగానే డిమాండ్ చేశారు. దీంతో జీవీఎల్ కు కాపుల్లో ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను విశాఖలో కాపులు సన్మానించారు. ఇలా కాపుల అంశాన్ని జీవీఎల్ ఎత్తుకోవడాన్ని కన్నా సహించలేకపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కాపుల కోసం జీవీఎల్ ఏం చేశారని కన్నా తన అనుచరుల వద్ద ప్రశ్నించారని తెలుస్తోంది. మరోవైపు కన్నా పార్టీ మారడంపై మీడియా ప్రశ్నలకు జీవీఎల్ సమాధానం చెప్పకుండా దండం పెట్టారంటే వారిద్ధరి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందో అర్థవుతోంది.


కన్నా దారెటు..?
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. టీడీపీలో చేరతారని టాక్ వచ్చింది. ఆ తర్వాత జనసేనలోకి వెళుతున్నారని వార్తలు వినిపించాయి. మొత్తంమీద కన్నా పార్టీ మారటం మాత్రం గ్యారంటీ అని చాలాకాలం వినిపిస్తున్న మాటే ఈ నేపథ్యంలో తన అనుచరులతో కన్నా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బీజేపీకి రాజీనామా చేశారు. 2014లో మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో బీజేపీలో చేరానని చెప్పారు. 2018లో పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారని..తన పనితీరు నచ్చే చాలామంది బీజేపీలో చేరారని కన్నా తెలిపారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకున్నానని చెప్పారు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగాలేదని ఆరోపించారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో పరిస్థితులు మారాయన్నారు. జీవీఎల్ వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిణామాల వల్లే తాను పార్టీకి రాజీనామా చేశానని కన్నా స్పష్టం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కన్నా రాజకీయ జీవితం తలక్రిందులైంది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. 2018 నుంచి కొంతకాలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుకు అప్పగించింది. దీంతో కన్నా క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఇక బీజేపీలో తనకు భవిష్యత్తు లేదనుకున్నారో? లేక బీజేపీకే రాష్ట్రంలో భవిష్యత్తు లేదనుకున్నారో మొత్తంమీద బీజేపీకి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు కన్నా దారెటు..?

Related News

Auto Driver Sevalo Scheme: ఆటోల్లో చంద్రబాబు, పవన్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు

Vijayawada News: ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం..ఆన్‌లైన్‌లో డబ్బులు జమ-సీఎం చంద్రబాబు

Ambati Rambabu: అమెరికాలో అంగరంగ వైభవంగా.. అంబటి రాంబాబు కూతురు పెళ్లి, రిసెప్షన్ ఎక్కడ?

Amaravati News: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఇక మీరెందుకు? కళ్లెం వేయాల్సిందే

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

AP Inter Exam 2026 Schedule: ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

Tirupati Bomb Threat: తిరుపతి ఉలిక్కిపడేలా.. బాంబు బెదిరింపులు

Amaravati: రాజధాని అమరావతిలో.. మలేషియా బృందం పర్యటన

Big Stories

×