Kurnool Protest: కర్నూలు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద శవంతో ధర్నా చేసిన ఘటన కలకలం రేపుతుంది. మార్చరీ నుంచి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కు మృతదేహం తరలించారు. అంబులెన్స్లోని డెడ్ బాడీని స్ట్రెచ్చర్పై తీసుకెళ్లి కలెక్టర్ ఆపీసుకు భంవదువులు కుటుంబ సభ్యులు నేతలు కలిసి పరుగులు తీసారు. గత నెల 30 తేదీన ఈరమ్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్చడింది. అనంతరం ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందింది.
అయితే గోనెగండ్ల గ్రామంలో 26 సెంట్లు స్థలము రెవిన్యూ అధికారులు ఇతరులకు పేరుమీద పాస్బుక్ పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు. మహిళా రైతు ఈరమ్మ మృతదేహంతో పాటు రైతు సంఘం, కులసంఘాల నాయకులు కలెక్టర్ ఆఫీసుముందు నిరసన వ్యక్తం చేసారు. ఈ సంఘటనకు బాధ్యులైన ఎమ్మార్వో, విఆర్వో, సర్వేయర్, ముగ్గురు అన్నదమ్ములపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్లే ఈరమ్మ తన ప్రాణాలు పోతున్నాయంటూ బాధితుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం పై జిల్లా కలెక్టర్ తక్షనమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలరి కోరారు. మరణించిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడి వారు డిమాండ్ చేసారు. కులవృత్తిని పార్టీలకు అతీతంగా చేసుకుంటున్నా మా చావులకు రాజకీయ నాయకులే కారణం అవుతున్నారని తెలిపారు. రజక సంఘం నేతలు చాకలి ఈరమ్మ ఆత్మహత్యపై గతంలో ఫిర్యాదు చేసినా డీఆర్వో పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. రెవెన్యూ ఉన్నతాధికారులు వచ్చి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని నేతలు తేచ్చి చెప్పారు.
Also Read: హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు