BigTV English
Advertisement

Lady Aghori: విశాఖలో లేడీ అఘోరీ.. పవన్ కల్యాణ్‌కు నా ఆశీస్సులు

Lady Aghori: విశాఖలో లేడీ అఘోరీ.. పవన్ కల్యాణ్‌కు నా ఆశీస్సులు

Lady Aghori: తెలంగాణ నుంచి నేరుగా ఏపీకి వెళ్లింది నాగ సాధు అలియాస్ మహిళ అఘోరీ. సోమవారం రాత్రి విశాఖకు చేరింది.నాగుల చవితి సందర్భంగా మంగళవారం ఉదయం జోడిగుడ్లపాలెంలోని నాగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది అఘోరీ. ఈ సందర్భంగా బీగ్ టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది అఘోరీ.


హిందుత్వాన్ని కాపాడడం, మహిళల రక్షణ, గో సంరక్షణ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని మనసులోని మాట బయటపెట్టింది అఘోరీ. ఎన్ని కేసులైనా పెట్టుకోండి తనకు ఏమీ కాదని తెలిపింది. తన శక్తులు తెలుసుకోవాలంటే హిమాలయాలకు వస్తే చూపిస్తానని తెలిపింది.

ముఖ్యంగా ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబానికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. తాను పవన్‌ను కలవనని, ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని చెప్పింది.


అంతకుముందు విశాఖ జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద మహిళా అఘోరీ హల్‌చల్ చేసింది. తన పట్ల టోల్‌గేట్‌ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని అఘోరీ ఆరోపించింది. నాగ సాధుకే రక్షణ లేకపోతే, మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ALSO READ:  రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

అందుకే కలియుగం ఇలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రెండు గంటల పాటు హైడ్రామా సాగింది. ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అఘోరీకి సరిదిద్ది చెప్పి పంపేశారు. అక్కడి నుంచి విశాఖపట్నానికి ఆమె చేరింది.

ఇంతకీ అఘోరీ ఆలోచన ఏంటి? ఆత్మార్పణం చేసుకుంటానని తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నానా హంగామా చేసింది.  హిందుత్వాన్ని కాపాడడమే తన లక్ష్యమని లేటెస్ట్‌లో ఏపీలో చెప్పుకొచ్చింది. అఘోరీ వెనుక సూత్రదారులు ఎవరో ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

 

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×