E-Paper
Advertisement

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం
Advertisement

Chennai Crime: రైలు కదులుతూ చిన్నగా రైల్వే స్టేషన్ వద్దకు వచ్చింది. అంతలోనే రైలు లోపల నుండి ఒక సూట్ కేస్ ను విసిరివేశారు అగంతకులు. తీరా అనుమానంగా ఉన్న ఆ సూట్ కేసును పోలీసులు ఓపెన్ చేశారు. ఇక అంతే ఒళ్లు జలధరించింది.. చేతులు, కాళ్లు వణికిపోయాయి. ఇంతకు సూట్ కేసులో ఏముందో తెలుసా.. రక్తపు మడుగులో శవం. రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదంతా మనం థ్రిల్లర్ సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ అచ్చం ఇలాగే జరిగింది చెన్నై సమీపంలోని మీంజూర్ రైల్వేస్టేషన్లో..

నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రిక్ రైలులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. వారి రైలు మీంజూర్ రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే, వారి వద్ద ఉన్న సూట్ కేస్ ను రైల్వేస్టేషన్లో పడేశారు. సూట్ కేస్ విసిరిన సమయంలో అక్కడే గల ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మహేష్ ఈ దృశ్యాన్ని గమనించాడు. ఇక సూట్ కేస్ నుండి రక్తం వస్తుండగా, అనుమానించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వెంటనే సూట్ కేసును ఓపెన్ చేశాడు.
అలా ఓపెన్ చేశాడో లేడో షాక్ కు గురయ్యాడు. ఆ సూట్ కేసులో ఉన్నది ఓ మహిళ మృతదేహం.

Advertisement

వెంటనే ఉన్నతాధికారులకు విషయం తెలిపిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆ తండ్రి కూతురిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ విచారణలో నెల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం, మరొకరు ఆయన కుమార్తె దివ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. ఇంతకు ఈ మహిళ ఎవరు? అసలేం జరిగిందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read: Ganesh Selfie Video: నా చావుకు కారణం వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యాలి.. సెల్ఫీ వీడియో వైరల్

Advertisement

సూట్ కేసులో శవాన్ని తెచ్చి రైల్వేస్టేషన్లో పడవేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మహిళను హత్య చేశారా? అన్ని ప్రశ్నలకు సమాధానం పోలీసుల ప్రకటనతో బహిర్గతం కావాల్సి ఉంది. మొత్తం మీద నెల్లూరుకు చెందిన మహిళను హత్య చేసి సూట్ కేసులో తీసుకువచ్చి ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకొనే ప్రయత్నం వీరిద్దరూ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×