E-Paper
Advertisement

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

Chennai Crime: రైలు కదులుతూ చిన్నగా రైల్వే స్టేషన్ వద్దకు వచ్చింది. అంతలోనే రైలు లోపల నుండి ఒక సూట్ కేస్ ను విసిరివేశారు అగంతకులు. తీరా అనుమానంగా ఉన్న ఆ సూట్ కేసును పోలీసులు ఓపెన్ చేశారు. ఇక అంతే ఒళ్లు జలధరించింది.. చేతులు, కాళ్లు వణికిపోయాయి. ఇంతకు సూట్ కేసులో ఏముందో తెలుసా.. రక్తపు మడుగులో శవం. రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదంతా మనం థ్రిల్లర్ సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ అచ్చం ఇలాగే జరిగింది చెన్నై సమీపంలోని మీంజూర్ రైల్వేస్టేషన్లో..

నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రిక్ రైలులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. వారి రైలు మీంజూర్ రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే, వారి వద్ద ఉన్న సూట్ కేస్ ను రైల్వేస్టేషన్లో పడేశారు. సూట్ కేస్ విసిరిన సమయంలో అక్కడే గల ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మహేష్ ఈ దృశ్యాన్ని గమనించాడు. ఇక సూట్ కేస్ నుండి రక్తం వస్తుండగా, అనుమానించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వెంటనే సూట్ కేసును ఓపెన్ చేశాడు.
అలా ఓపెన్ చేశాడో లేడో షాక్ కు గురయ్యాడు. ఆ సూట్ కేసులో ఉన్నది ఓ మహిళ మృతదేహం.

వెంటనే ఉన్నతాధికారులకు విషయం తెలిపిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆ తండ్రి కూతురిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ విచారణలో నెల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం, మరొకరు ఆయన కుమార్తె దివ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. ఇంతకు ఈ మహిళ ఎవరు? అసలేం జరిగిందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read: Ganesh Selfie Video: నా చావుకు కారణం వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యాలి.. సెల్ఫీ వీడియో వైరల్

సూట్ కేసులో శవాన్ని తెచ్చి రైల్వేస్టేషన్లో పడవేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మహిళను హత్య చేశారా? అన్ని ప్రశ్నలకు సమాధానం పోలీసుల ప్రకటనతో బహిర్గతం కావాల్సి ఉంది. మొత్తం మీద నెల్లూరుకు చెందిన మహిళను హత్య చేసి సూట్ కేసులో తీసుకువచ్చి ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకొనే ప్రయత్నం వీరిద్దరూ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×