BigTV English
Advertisement

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

Chennai Crime: రైలు కదులుతూ చిన్నగా రైల్వే స్టేషన్ వద్దకు వచ్చింది. అంతలోనే రైలు లోపల నుండి ఒక సూట్ కేస్ ను విసిరివేశారు అగంతకులు. తీరా అనుమానంగా ఉన్న ఆ సూట్ కేసును పోలీసులు ఓపెన్ చేశారు. ఇక అంతే ఒళ్లు జలధరించింది.. చేతులు, కాళ్లు వణికిపోయాయి. ఇంతకు సూట్ కేసులో ఏముందో తెలుసా.. రక్తపు మడుగులో శవం. రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదంతా మనం థ్రిల్లర్ సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ అచ్చం ఇలాగే జరిగింది చెన్నై సమీపంలోని మీంజూర్ రైల్వేస్టేషన్లో..


నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రిక్ రైలులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. వారి రైలు మీంజూర్ రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే, వారి వద్ద ఉన్న సూట్ కేస్ ను రైల్వేస్టేషన్లో పడేశారు. సూట్ కేస్ విసిరిన సమయంలో అక్కడే గల ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మహేష్ ఈ దృశ్యాన్ని గమనించాడు. ఇక సూట్ కేస్ నుండి రక్తం వస్తుండగా, అనుమానించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వెంటనే సూట్ కేసును ఓపెన్ చేశాడు.
అలా ఓపెన్ చేశాడో లేడో షాక్ కు గురయ్యాడు. ఆ సూట్ కేసులో ఉన్నది ఓ మహిళ మృతదేహం.

వెంటనే ఉన్నతాధికారులకు విషయం తెలిపిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆ తండ్రి కూతురిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ విచారణలో నెల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం, మరొకరు ఆయన కుమార్తె దివ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. ఇంతకు ఈ మహిళ ఎవరు? అసలేం జరిగిందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


Also Read: Ganesh Selfie Video: నా చావుకు కారణం వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యాలి.. సెల్ఫీ వీడియో వైరల్

సూట్ కేసులో శవాన్ని తెచ్చి రైల్వేస్టేషన్లో పడవేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మహిళను హత్య చేశారా? అన్ని ప్రశ్నలకు సమాధానం పోలీసుల ప్రకటనతో బహిర్గతం కావాల్సి ఉంది. మొత్తం మీద నెల్లూరుకు చెందిన మహిళను హత్య చేసి సూట్ కేసులో తీసుకువచ్చి ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకొనే ప్రయత్నం వీరిద్దరూ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×