E-Paper
Advertisement

Tirupati: ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి కలకలం.. విద్యార్థుల్లో భయం భయం..

Tirupati: ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి కలకలం.. విద్యార్థుల్లో భయం భయం..
Advertisement
Leopard

Tirupati: తిరుమల కాలిబాటలో చిరుతపులి కలకలం రేపుతోంది. ఇటీవల ఓ బాలుడిపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లగా.. తాజాగా ఓ చిన్నారిని చంపేయడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. టీటీడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి.. నడకమార్గంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. అంతా అటువైపు ఫోకస్ చేస్తే.. సడెన్‌గా తిరుపతిలో ప్రత్యక్షమైంది చిరుతపులి.

అవును, తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో సోమవారం రాత్రి చిరుత చనిపించింది. విద్యార్థులు గ్రౌండ్‌లో సరదాగా గడుపుతుంటే.. వారికి కాస్త దూరం నుంచి చిరుతపులి దర్జాగా నడుచుకుంటూ వెళ్లింది.

Advertisement

చిరుతను చూడగానే స్టూడెంట్స్ అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. కొందరు ధైర్యం చేసి సెల్‌ఫోన్లో వీడియో తీశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

రాత్రి వేళలో కాలేజ్ గ్రౌండ్‌లో చిరుతపులి కనిపించిందనే మేటర్ విని స్టూడెంట్స్ అంతా భయంతో హడలిపోతున్నారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులు ఎప్పుడు ఎటునుంచి చిరుత దాడి చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో ఉండే ప్రజలు సైతం చిరుత విషయం తెలిసి.. హైరానా పడుతున్నారు.

Advertisement

వామ్మో.. ఇప్పటికే తిరుమల కాలిబాటలో ఓ చిన్నారిని చంపేసింది.. ఆ చిరుతను పట్టేసుకున్నా.. ఇప్పుడు ఇంకో చిరుతపులి జనారన్యంలోకి వచ్చిందని తెలీగానే.. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడిపోతున్నారు స్థానికులు. అసలే రాత్రి సమయం కావడంతో.. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయంతో చచ్చిపోతున్నారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా ఆ చిరుతను బంధించాలని వేడుకుంటున్నారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×