E-Paper
Advertisement

Lokesh : నేడు నెల్లూరు జిల్లాలోకి లోకేశ్ ఎంట్రీ.. రాయలసీమలో ఎన్ని కిలోమీటర్లు నడిచారంటే..?

Lokesh : నేడు నెల్లూరు జిల్లాలోకి లోకేశ్ ఎంట్రీ.. రాయలసీమలో ఎన్ని కిలోమీటర్లు నడిచారంటే..?
Advertisement

Nara Lokesh padayatra live today(AP latest news): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలయ్యే ఈ పాదయాత్ర నెల రోజులపాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. రోజూ సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక నాయకుల పరిచయం, స్థానిక సమస్యలపై చర్చ ఉంటుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో సాగుతుంది.

Advertisement

సాయంత్రం 4 గంటలకు జిల్లా సరిహద్దదలోని మర్రిపాడు మండలం వద్ద కదిరినాయుడుపల్లిలో నారా లోకేశ్ ప్రవేశిస్తారు. నియోజకవర్గ బాధ్యులు ఆనం, జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. తొలిరోజు 7 కిలోమీటర్లు నడిచి పడమటి నాయుడుపల్లికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు.

నారా లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గాల్లో సాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. ఆత్మకూరు నుంచి మొదలయ్యే పాదయాత్ర వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల మీదుగా ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

Advertisement

లోకేశ్ యువగళం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను నెల్లూరు-కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బుల్లెట్‌ రమణ పరిశీలించారు.

రాయలసీమలో 124 రోజులపాటు లోకేశ్ పాదయాత్ర సాగింది. నాలుగు జిల్లాల్లో 44 నియోజకవర్గాల్లో 1587 కిలోమీటర్లు నడిచారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×