E-Paper
Advertisement

TSPSC : త్వరలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ కీ విడుదల .. మెయిన్స్‌ ఎప్పుడంటే..?

TSPSC : త్వరలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్  కీ విడుదల .. మెయిన్స్‌ ఎప్పుడంటే..?

TSPSC group 1 prelims key Updates(Latest news in telangana) : గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. మాస్టర్‌ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని త్వరలోనే వెబ్‌సైట్ లో పెట్టేందుకు ‌ ఏర్పాట్లు చేస్తోంది. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత తుది కీ విడుదల చేయనుంది. అనంతరం మూల్యాంకనం చేపట్టి ఫలితాలు వెల్లడించాలని యోచిస్తోంది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత 3 నెలలకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనుంది.

సెప్టెంబర్ నెలాఖరు వరకు ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి. అందుకే అక్టోబర్ లేదా నవంబర్ లో గ్రూపు-1 మెయిన్స్‌ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు.. రద్దై గత ఎగ్జామ్ తో పోల్చితే 50 వేల మంది తక్కువగా హాజరయ్యారు.

ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ అనేక సంస్కరణలు చేపట్టింది. కమిషన్‌ ఉద్యోగులు పరీక్షలు రాస్తే వారిని నిర్బంధ సెలవులో పంపించాలని నిర్ణయించింది. తాజాగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు 10 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. వారిని పరీక్ష తేదీకి 2 నెలల ముందు, పరీక్ష తర్వాత నెల రోజుల వరకు ఉద్యోగాలకు సెలవు పెట్టించింది.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×