E-Paper
Advertisement

Liquid Ganja: మత్తు మాఫియా మైండ్ గేమ్.. స్కూల్ బ్యాగుల్లో రూ.1.43 కోట్ల గంజాయి

Liquid Ganja: మత్తు మాఫియా మైండ్ గేమ్.. స్కూల్ బ్యాగుల్లో రూ.1.43 కోట్ల గంజాయి
Advertisement

Liquid Ganja: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో భారీగా లిక్విడ్ గంజాయి కలకలం రేపింది. చింతపల్లి పోలీసులు నిర్వహించిన వ్యూహాత్మక తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో చింతపల్లి పోలీసులు లోతుగెడ్డ బ్రిడ్జి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న స్కూల్ బ్యాగులో ఉన్న నిషిద్ధ లిక్విడ్ గంజాయిని చూసి షాక్ అయ్యారు. సుమారు 11.440 కిలోల బరువున్న ఈ హషీష్ ఆయిల్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 1 కోటి 43 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న లమ్మడంపల్లి గ్రామానికి చెందిన బోనంగి జకరియా, బోనంగి ధనబాబు లను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి లిక్విడ్ గంజాయితో పాటు ఒక బైకు , రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఈ ముఠాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న బోనంగి మార్క్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులు రోలగడ్డ శివారు ప్రాంతాల నుండి ఈ గంజాయిని సేకరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితులు అత్యంత తెలివిగా స్కూల్ బ్యాగులను రవాణాకు ఉపయోగించడం గమనార్హం. పట్టుబడిన నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వినోద్ బాబు, ఎస్సై వీరబాబు వివరాలు వెల్లడించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Also Read: నువ్వు తోపు బాస్..! కాటేసిన పాముతో హాస్పిటల్‌కి..

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×