E-Paper
Advertisement

AP Gas supply status: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు: మంత్రి నాదెండ్ల మనోహర్

AP Gas supply status: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు: మంత్రి నాదెండ్ల మనోహర్

AP Gas supply status: అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన గ్యాస్ నిల్వలు, సరఫరా తీరును సమీక్షించారు. రాష్ట్రంలో గృహ మరియు వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ మన రాష్ట్రంపై దాని ప్రభావం ప్రస్తుతానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు.

గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు. అవసరమైతే వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తూ గృహ అవసరాలకు లోటు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నం రిఫైనరీ అలాగే హస్సన్-చర్లపల్లి పైపులైన్ ద్వారా వస్తున్న సరఫరాను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. నిల్వల్లో స్వల్ప మార్పులు వచ్చినా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

బ్లాక్ మార్కెట్ నిరోధానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గ్యాస్ సిలిండర్లు పక్కదోవ పట్టకుండా జిల్లాల వారీగా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే వారిపై లేదా పుకార్లు వ్యాప్తి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సరఫరా గొలుసులో ఎక్కడైనా లోపాలు తలెత్తితే తక్షణమే వాటిని సరిదిద్దేలా రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని నాదెండ్ల మనోహర్ కోరారు. పౌరసరఫరాల శాఖ నిరంతరం చమురు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని నిల్వల విషయంలో ఎటువంటి లోటు లేదని పునరుద్ఘాటించారు. ఈ క్లిష్ట సమయంలో యంత్రాంగం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: తెలుగు వైభవం ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×