E-Paper
Advertisement

Nara Lokesh: జడ్ ప్లస్ భద్రత ఉన్నా సరిపోదా ? జగన్‌పై లోకేష్ కామెంట్స్

Nara Lokesh: జడ్ ప్లస్ భద్రత ఉన్నా సరిపోదా ? జగన్‌పై లోకేష్ కామెంట్స్
Advertisement

Nara Lokesh: మాజీ సీఎం జగన్‌కు జడ్ ప్లస్ భద్రత ఉన్నా అభద్రతా భావం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్‌కు ప్రస్తుతం 58 మందితో భద్రత ఉందని ఎక్స్ వేధికగా లోకేష్ పేర్కొన్నారు. రెండు ఎస్కాట్ బృందాలతో పాటు 10 మంది సాయుధ గార్డులతో జగన్ భద్రత ఉందని అన్నారు. అంతే కాకుండా కాన్వాయ్‌లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయని తెలిపారు. ఇవి సరిపోక.. ఇంకా 986 భద్రత ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ జగన్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఇదిలా ఉంటే మరో వైపు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ 139 మంది గన్ మెన్లను అడుగుతున్నారని అది భద్రత కోసం కాదని స్టేటస్, ఆర్భాటం కోసమేనని ఆరోపించారు. ఈ సందర్భంగానే జగన్‌కు 59 మంది గన్‌మెన్లు చాలదా అని ప్రశ్నించారు. 139 మంది గన్ మెన్లతో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇది జగన్ పిరికితనానికి దర్పణమని తెలిపారు. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేల లాగా జగన్ కూడా ఒక ఎమ్మెల్యేనే అని అన్నారు.

Also Read: అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం: వైఎస్ జగన్

Advertisement

ఎమ్మెల్యేలకు 1+1 లేక 2+2 గన్ మెన్ల భద్రత మాత్రమే ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. అలాగే జగన్ కు కూడా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా స్టేటస్ కోసం గన్ మెన్లను ఇవ్వడం సరికాదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జగన్ హైకోర్టు పిటిషన్ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×