E-Paper
Advertisement

Hero Vishal: యువతిపై అత్యాచారం.. మీ కాళ్లు పట్టుకుంటానంటూ హీరో విశాల్‌ ట్వీట్‌

Hero Vishal: యువతిపై అత్యాచారం.. మీ కాళ్లు పట్టుకుంటానంటూ హీరో విశాల్‌ ట్వీట్‌

Vishal Reacts on Coimbatore Assaulted Case: తమిళనాడులో యువతిపై సాముహిక అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనలో బాధితురాలిని నిందించిన ఎమ్మెల్యే తీరు తప్పుబడుతున్నారు. కొయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓ కళశాల విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుంది. ఈ క్రమంలో కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు సమీపంలో ఆగి ఉన్న కారు నుంచి ముగ్గురు వ్యక్తులు ఆమెను అపహరించి శారీకంగా వేధించారు.

మహిళపై సాముహిక అత్యాచారం

అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ ఘటనలో అర్థరాత్రి ఆ యువతి బయట తిరగడాన్ని ఎమ్మెల్యే ఈశ్వరన్‌ తప్పుబడుతూ చేసిన కామెంట్స్‌ వివాదస్పదంగా మారాయి. అర్థరాత్రి స్నేహితుడితో కలిసి తిగరడాన్ని సామాజిక పతనం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సినీ, రాజకీ య ప్రముఖులు ఎమ్మెల్యే ఈశ్వరన్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

రాజకీయం చేయడం ఆపండి

అలాగే హీరో విశాల్‌ కూడా ఈ అత్యాచార ఘటనపై స్పందించాడు.  ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ మీ కాళ్లు మొక్కుతా ఈ ఘటనన రాజకీయం చేయడం ఆపండి అంటూ వేడుకున్నాడు. ఆ రాత్రి ఆడపిల్ల అక్కడ ఎందుకు ఉందంటూ బాధితురాలినినింధించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను రాజకీయం చేయడం మానుకోండంటూ విశాల్‌ తన ట్వీట్‌లో  రాసుకొచ్చాడు. “న్యాయవ్యవస్థను ముందు మోకరిల్లు వేడుకుంటున్నా. మీ కాళ్లు పట్టుకుంటా. దయచేసి ఈ దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులకు ఉరిశిక్ష వేయండి. గతంలో నిర్భయలాంటి ఉదంతాలను చూశాం.

ఉరిశిక్ష వేయండి!

ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె కన్నతల్లిని హత్యచేసిన కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన వ్యక్తి సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు అతడిని నిర్దొషిగా తీర్పు ఇచ్చింది. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. అదే ఇలాంటివి సౌది అరేబియా వంటి దేశాల్లో జరుగుతుందా? ఎందుకంటే అక్కడ దోషులకు అంతటి కఠిమైన శిక్షలు ఉంటాయి. కానీ, మన దేశంలో ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్థులు మరింత రెచ్చిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇలాంటి నేరం జరిగినప్పుడు దివంగత ముఖ్యంత్రి వైఎస్‌ఆర్‌ (వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి) తీసుకున్న చర్యలు మెచ్చకోదగినవి. ఆయనకు నేను సెల్యూట్‌ చేస్తున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది” అంటూ విశాల్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతడి ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×