E-Paper
Advertisement

Modi : కందుకూరు ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన..

Modi : కందుకూరు ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన..
Advertisement

Modi : ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందానన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ఇస్తామన్నారు.

మరోవైపు చంద్రబాబాబు సభలో తొక్కిసలాట ఘటనపై కేసు నమోదైంది. సెక్షన్‌ 174 కింద కందుకూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతారు. అటు మృతదేహాలకు కందుకూరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 8 మంది మృతదేహాలను అంబులెన్స్ ల్లో వారి స్వస్థలాలకు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే పేరుతో యాత్ర చేపట్టారు. బుధవారం కందుకూరు ఎన్టీఆర్‌ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.

Advertisement

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బాబుకు ప్రచార యావ చాలా ఎక్కువని విమర్శిస్తున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంతో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోరని మండిపడుతున్నారు. ఇరుకురోడ్డులో బహిరంగ సభ నిర్వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.

పోలీసుల తీరును టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వేతర కార్యక్రమాలకు వచ్చినా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు.. చంద్రబాబు పర్యటనను పట్టించుకోలేదని అంటున్నారు. ఈ నెల 20న ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కుమారుడి వివాహ విందుకు సీఎం జగన్ వచ్చినప్పుడు 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ నెల 26న మంత్రి ఆదిమూలపు సురేష్‌ తల్లి మృతి చెందగా.. ఆ తర్వాత రోజు సీఎం జగన్ మంత్రిని పరామర్శించడానికి వచ్చినప్పుడు వెయ్యి మందితో బందోబస్తు నిర్వహించారని.. చంద్రబాబు పర్యటనలో మాత్రం పోలీసులు ఆ స్థాయిలో కనిపించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×