E-Paper
Advertisement

Nandyal : చనిపోయిన తల్లిని దూషించాడని .. సొంత బామర్ది హత్య..

Nandyal : చనిపోయిన తల్లిని దూషించాడని .. సొంత బామర్ది హత్య..
Advertisement

Nandyal : చనిపోయిన తన తల్లిని దుర్భాషలాడినందుకు కక్షగట్టి సొంతం బామర్దినే కడతెర్చాడు ఓ వ్యక్తి . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని చాగలమరి గ్రామానికి చెందిన సుభాన్ అనే వ్యక్తి తల్లి చాలా రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే సుభాన్ అత్త కొడుకు అస్లాం మద్యం తాగినప్పుడల్లా చనిపోయిన అత్తను తిడుతూ ఉండేవాడు. సుభాన్ చాలా రోజులు భరించాడు. అస్లాం మాటలు తీరం దాటిపోవడంతో సుభాన్ కక్ష పెంచుకున్నాడు.

నాలుగు రోజుల కిందట ఓ కొత్త కత్తిని కొన్నాడు. ఎప్పటిలాగే మందు సిట్టింగ్ వేసేందుకు సుభాన్, అస్లాం ,అతని స్నేహితుడు ముగ్గురు కలిసి ఇంటి మిద్దెపై కూర్చున్నారు. మద్యం సేవిస్తున్న సమయంలో అస్లాం మళ్లీ సుభాన్ తల్లి గురించి తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడాడు. ఇక తట్టుకోలేని సుభాన్ ఇదే సమయం అనుకొని అస్లాం కళ్లల్లో కారంపొడి కొట్టి తన వెంట తెచ్చుకున్న కొత్త కత్తితో మెడమీద, కడుపులో తీవ్రంగా దాడి చేశాడు.

Advertisement

దాంతో అస్లాం అక్కడికక్కడే రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. శనివారం ఉదయం అస్లాం తల్లి నజీమున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాగలమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అస్లాంను దారుణంగా హత్య చేసిన సుభాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×