AP Employees: ఉద్యోగుల సమస్యలపై ఈరోజు 11 సంఘాలతో సీఎం సమావేశం జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం మాట్లాడారు. అలాగే ఈ రెండేళ్లలో ఉద్యోగులకు ప్రభుత్వం ఎం చేసిందో చెప్పారు. అనేక ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో ఉద్యోగుల సంయమనం పాటించాలని సీఎం సూచించారు. ఈ రెండేళ్లలో కామన్ ఎంప్లాయిస్ కు బెనిఫిట్ ఏమి రాలేదని దా:నిపై ఆలోచిస్తామని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అలాగే పీఆర్సీ కమిషన్ కూడా త్వరలోనే వస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
ఏపీ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీపుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించి అనంతరం సీఏం నిర్ణయాలు తెలిపారు. సిఎం ప్రకటన ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హమీ ఇచ్చారు.
Also read: ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !
12వ PRC నియామకానికి అంగీకారం తెలిపారు. రెండు డిఎలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లింపు చేస్తానని అన్నారు. 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదల చేస్తామని, 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్లో వేయడానికి అంగీకారం తెలిపారు. పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లింపుతో పాటు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు చేస్తనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం తెలిపారు. ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also read: హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!