E-Paper
Advertisement

Nagababu: వాడో పెద్ద వెధవ.. వర్మపై నాగబాబు ఫైర్.. వైసీపీకీ కౌంటర్

Nagababu: వాడో పెద్ద వెధవ.. వర్మపై నాగబాబు ఫైర్.. వైసీపీకీ కౌంటర్
Advertisement

Nagababu: ఏపీలో అందరి టార్గెట్ పవన్ కల్యాణే. వైసీపీ నేతలకు రోజూ పవన్ ను తిట్టడమే పని. సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ.. అంతా జనసేనానిపై నోరు పారేసుకుంటారు. వారికి తోడుగా కొత్తగా రామ్ గోపాల్ వర్మ సైతం జతకలిశారు. వైసీపీ మీద సినిమా తీస్తున్నందుకో.. పవన్ మీద పాత పగలో.. కారణం ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడల్లా మెగా ఫ్యామిలీని గిల్లుతుంటాడు ఆర్జీవి. దీంతో.. చిర్రెత్తుకొచ్చిన మెగా బ్రదర్ నాగబాబు వర్మకు, వైసీపీకి ఇద్దరికీ కలిసి ఇచ్చిపడేశారు.

ఇటీవల పవన్ కల్యాణ్.. చంద్రబాబును ఇంటికెళ్లి కలిశారు. కుప్పంలో బాబును అడ్డుకున్న ఉదంతంపై, జీవో నెంబర్ 1పై ఆ ఇద్దరూ కలిసి చర్చించారు. వారి భేటీపై వైసీపీ నేతలు వరుసబెట్టి మాటల దాడి చేస్తున్నారు. ప్యాకేజీ కోసమే పవన్.. చంద్రబాబును కలిశారంటూ ఎప్పటిలానే ఆరోపణలు చేశారు.

Advertisement

ఇక, ఆర్జీవీ అయితే తనదైన స్టైల్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ప్యాకేజ్ కోసం కాపులను తాకట్టు పెట్టావంటూ.. పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై కాపు సంఘాలు ఇప్పటికే మండిపడ్డాయి. ఇప్పుడిక పవన్ సోదరుడు నాగబాబు అటు వైసీపీపై, ఇటు వర్మపై ఫైర్ అయ్యారు.

పవన్ కు ప్యాకేజీ ఎవరు ఇచ్చారు? వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్ కు ప్యాకేజీ ఇచ్చారా? అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకునే పవన్ కు ప్యాకేజీ అవసరమా? అని ప్రశ్నించారు. అటు.. రామ్ గోపాల్ వర్మ పెద్ద వెధవ అంటూ నాగబాబు మండిపడ్డారు. అవసరం కోసం వర్మ ఎంత నీచానికైనా దిగజారుతాడని చీదరించుకున్నారు. నాగబాబు కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

Related News

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

Big Stories

Advertisement
×