Nagayalanka: నాగాయలంకలో కృష్ణా నది తీరాన రామలింగేశ్వర స్వామి దేవాలయం వెనుక భాగంలో వందల సంఖ్యలో పాములు నదిలో ఈదుతూ కనిపిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి రోజుల్లో (ముఖ్యంగా కార్తీక పౌర్ణమి సమయంలో లేదా నవంబర్ మధ్యలో) జరిగే సంఘటనగా సహజ దృశ్యమని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో ఈ అద్బుత దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కృష్ణా నది డెల్టా, మాంగ్రోవ్ అడవులు, చిత్తడి నేలలు ఎక్కువ. ఈ ప్రాంతంలో చాలా రకాల పాములు (ముఖ్యంగా రాట్ స్నేక్స్ లేదా ఎలుక పాములు) నివసిస్తాయి. ఇవి విషరహితం (non-venomous) పాములు కావడం గమనార్హం.
కార్తీక మాసం (నవంబర్ మధ్య నుంచి డిసెంబర్)లో వర్షాకాలం తర్వాత నీటి స్థాయి తగ్గడం, ఉష్ణోగ్రత మార్పులు, ఆహారం కోసం మైగ్రేషన్ వల్ల పాములు నది నీటిలోకి వచ్చి ఈదుతూ కనిపిస్తాయట. ఇది ఒక రకమైన సీజనల్ మైగ్రేషన్ లాంటిదని, మాంగ్రోవ్ అడవుల నుంచి నది మార్గంలోకి వస్తాయి.
ఇలాంటి దృశ్యాలు ప్రపంచంలోని ఇతర చోట్ల కూడా ఉన్నాయి. కెనడాలోని నార్సిస్సా స్నేక్ డెన్స్ లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ హిందూ సంప్రదాయాలతో ముడిపడి ఉండటం వల్ల మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
కార్తీక మాసం శివ-విష్ణు దేవతలకు అత్యంత పవిత్రమైన నెల. ఈ సమయంలో నదుల్లో స్నానం, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. పాములు (నాగ దేవతలు) హిందూ పురాణాల్లో శివుడి ఒడిలో, విష్ణు మీద అనంత శేషుడిగా ఉంటాయి. కాబట్టి ఈ దృశ్యాన్ని స్థానికులు “నాగ దేవతల దర్శనం”గా భావిస్తారు. రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరగడం వల్ల మరింత ఆధ్యాత్మికంగా చూస్తారు.
ఇది ప్రతి ఏటా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో బాగా కనిపిస్తాయట. అయితే ఈ పాములు సాధారణంగా మనుషులను హాని చేయవు. కానీ దూరంగా ఉండటం మంచిది. విషపాములు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రాంతంలో మాంగ్రోవ్ అడవులు నాశనం కావడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి దృశ్యాలు తగ్గే అవకాశం ఉందని పర్యావరణ పరిరక్షణ నిపుణులు చెబుతున్నారు.
https://twitter.com/VijayMarka88/status/1991073941339660434
Read Also: Kartika Amavasya: కార్తీక మాసం చివరి అమావాస్య.. ఇలా చేయకపోతే అన్నీ కష్టాలే !