E-Paper
Advertisement

Nara Brahmani: మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు గెలుచుకున్న నారా బ్రాహ్మణి

Nara Brahmani: మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు గెలుచుకున్న నారా బ్రాహ్మణి
Advertisement

Nara Brahmani: మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వ్యాపార మ్యాగజైన్ బిజినెస్ టుడే ప్రతి సంవత్సరం ప్రకటించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును ఈసారి నారా బ్రాహ్మణి ఎంపికయ్యారు. వ్యాపార రంగంలో మహిళల నాయకత్వం, సంస్థల అభివృద్ధిలో వారి ముఖ్య పాత్రకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

హెరిటేజ్ ఫుడ్స్ అభివృద్ధిలో కీలక పాత్ర

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అభివృద్ధి, బ్రాండ్ విలువను పెంచడం వంటి కీలక అంశాల్లో బ్రాహ్మణి తనదైన ముద్ర వేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థ పురోగతిలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.

Advertisement

‘నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన బిజినెస్ టుడే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డులలో గుర్తింపు పొందడం నాకు చాలా గౌరవంగా ఉంది. నా దృష్టిలో నాయకత్వం అంటే శాశ్వతమైన, బాధ్యతాయుతంగా విలువను సృష్టించే, ప్రజలకు సాధికారత కల్పించే సంస్థలను నిర్మించడం’ అని నారా బ్రాహ్మణి అన్నారు.

మంత్రి లోకేశ్ హర్షం

నారా బ్రాహ్మణి విజయంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన అర్ధాంగిని అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. ఈ అవార్డు పట్ల భర్తగా గర్విస్తున్నానన్నారు. మాటల కన్నా పనితోనే సమాధానం చెప్పడం, నిశ్శబ్దంగా సంస్థలను నిర్మించడం బ్రాహ్మణి నాయకత్వ లక్షణాలకు నిదర్శనం అని ప్రశంసించారు.

Advertisement

Also Read: BARC In AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అనకాపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం

‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ – 2025’ అవార్డును గెలుచుకున్న నారా బ్రాహ్మణికి మంత్రులు, టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నారా బ్రాహ్మణికి అభినందలు తెలుపుతున్నారు. భారతీయ వ్యాపార రంగంలో మహిళా సాధికారతకు నారా బ్రాహ్మణి ఒక గొప్ప ఉదాహరణగా కితాబిస్తున్నారు. బ్రాహ్మణి ప్రస్థానం ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు, ఎంతో స్ఫూర్తిదాయకం అని అంటున్నారు.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×