E-Paper
Advertisement

BARC In AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అనకాపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం

BARC In AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అనకాపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం

BARC In AP: ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్ఠాత్మక సంస్థలు క్యూకడుతున్నాయి. గూగుల్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర సంస్థ బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (BARC)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో మూడు వేల ఎకరాల్లో బార్క్ సంస్థను విస్తరించనున్నట్లు సమాచారం.

175 పారిశ్రామిక పార్కులు

ఇంటికో పారిశ్రామికవేత్త, నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక పార్కు నినాదంతో ఎంఎస్ఎంఈల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం సహకారంతో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దాదాపు 11 వేల కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.

పలు కంపెనీలకు భూకేటాయింపు

కూటమి ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించేందుకు అన్ని విధాలా పనిచేస్తుంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే వేగంగా అనుమతులు ఇస్తుంది. సింగిల్ విండో డెస్క్ తో అనుమతులు జారీ చేస్తూ.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. అనుమతులు మంజూరుతో భూసేకరణ త్వరగా పూర్తి చేస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం పలు కంపెనీలకు భారీగా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీలకు కేబినెట్‌తో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోద ముద్రవేసింది.

100 ఎకరాలు

విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీకి 100.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ కంపెనీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఐపీ గుట్టపాడు క్లస్టర్‌లో ఫార్మా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ కంపెనీకి ఎకరం రూ. 30 లక్షల చొప్పున మొత్తం 100 ఎకరాలకు కేటాయించింది ప్రభుత్వం. ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీకి గతంలో 105.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఉత్తర్వులను రద్దు చేసి ఆ భూములను విరూపాక్ష కంపెనీకి కేటాయించింది.

Also Read: Road accident: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో ఎస్ఐ సస్పెండ్..

నెల్లూరు జిల్లా రాచర్లపాడులో ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ కంపెనీకి 2,776.23 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కంపెనీ రూ. 870 కోట్ల పెట్టుబడులతో 70 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×