BigTV English

Nara Lokesh: “జోరుగా గంజాయి సాగు.. సంక్షోభంలో వ్యవసాయం”

Nara Lokesh: “జోరుగా గంజాయి సాగు.. సంక్షోభంలో వ్యవసాయం”

Nara Lokesh: ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంటే.. గంజాయి సాగు మాత్రం జోరుగా సాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 224వ రోజు ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో భాగంగా.. లోకేష్ అరబుపాలెం బీసీల నాయకులు, అనకాపల్లిలోని బెల్లం తయారీదారులు, గంగాదేవిపేటలో రైతులతో సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. బీసీలపై జగన్ ప్రభుత్వం 26 వేల అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల అండతోనే గంజాయి సాగు జరుగుతోందని ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లబెల్లంపై ఆంక్షల్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరకు రైతులకు ప్రభుత్వం తరపున సహకారం అందించి ఆదుకుంటామన్నారు. అలాగే శారదకాల్వ పూడిక తీయించి.. నీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం మునగపాకలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లిన లోకేష్.. టీడీపీ ప్రభుత్వం రాగానే అంగన్వాడీల డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ బెదిరింపు వ్యాఖ్యలు నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. అంగన్వాడీలు నిరసనలు చేస్తే.. వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు చెప్పడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారని విమర్శించిన లోకేష్.. వారి న్యాయపోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×