E-Paper
Advertisement

AP Politics: జగన్ ‘పరకామణి’ వ్యాఖ్యలు.. మీడియాకు మసాలా, లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

AP Politics: జగన్ ‘పరకామణి’ వ్యాఖ్యలు.. మీడియాకు మసాలా, లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

AP Politics: వైసీపీ మళ్లీ అబాసుపాలైందా? మీడియాకు జగన్ మసాలా ఇచ్చేశారా? గురువారం జగన్ మీడియా సమావేశంపై టీడీపీ నుంచి ఎదురుదాడి మొదలైందా? వైసీపీకి ఉన్న పరువుపోయినట్టేనా? ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది?

జగన్ ‘పరకామణి’ వ్యాఖ్యలు, వైసీపీలో కలకలం

Advertisement

పార్టీల అగ్రనేతలు.. నేతలకు కీలక సూచన చేస్తుంటారు. ఎలాంటి మసాలా ఇవ్వకుండా మీడియా ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెబుతుంటారు. అలాంటి అధినేత ఆ తరహా మసాలా ఇస్తే, ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం ఏపీలోని మాజీ సీఎం జగన్ పరిస్థితి ఆ విధంగా తయారైంది.

ఏపీలో రాజకీయాలు మారాయి. కీలక నేతలు మీడియా ముందుకొచ్చిన 24 గంటల తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఖండించేవి. ఇదంతా ఒకప్పటి మాట. సోషల్ మీడియా బలంగా ఉన్న రోజుల్లో గంటల వ్యవధిల్లో కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతున్నాయి. గురువారం మీడియా ముందుకొచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, పరకామణి చోరీ కేసులో దొంగతనం జరిగిందని నిజం ఒప్పేసుకున్నారు.

Advertisement

లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

దాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. అది చిన్న చోరీ అని, దొంగ తన ఆస్తులను టీటీడీకి ఇచ్చారని చెప్పుకొచ్చారు.  ఇలాంటి సందర్భం ఏపీలో ఎప్పుడూ లేదని చెప్పకనే చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే చోరీ జరిగిందని నిజమేనన్నది జగన్ మాట.

ఈ వ్యవహారంపై మంత్రి లోకేష్ ఘాటు కౌంటరిచ్చారు. పార్వతీపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన , గత రాత్రి పాలకొండ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మిస్‌ఫైర్, క్రాస్‌ఫైర్, విడాకులు వంటివి మన పార్టీలో ఉండవని వ్యాఖ్యానించారు. పరకామణిలో చోరీ జరిగితే చిన్నదంటూ జగన్‌ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఆయన్ని దేవుడే చూసుకుంటాడని అన్నారు.

ALSO READ: ఏపీలో ఇళ్ల స్థలాల దరఖాస్తు గడువు పెంపు, ఎలా అప్లై చేయాలంటే

జగన్ పరకామణి వాదనపై టీడీపీ సోషల్ మీడియా ఓ రేంజ్‌లో ఆట ఆడేసుకుంటోంది. కోట్లాది మంది భక్తులు తమ ముడుపులు, మొక్కులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తారని రాసుకొచ్చింది. అలాంటి పవిత్రమైన కానుకలను హుండీల నుంచి నేరుగా చోరీ చేస్తే.. అది చిన్న చోరీ అట, ఆ దొంగ చాలా మంచివాడని అంటున్నారని పేర్కొంది. దీనికి జగన్ మాట్లాడిన వీడియోని లింకు చేసింది.

జగన్ మాటలను చూసి వైసీపీ నేతలు షాకయ్యారు. పార్టీ నేతల కేసుల గురించి అసలు నిజాలు అధినేత స్వయంగా చెబుతున్నారని అంటున్నారు. వాటి గురించి మాట్లాడకుండా కూటమి పాలనపై ఎదురుదాడి చేస్తే బాగుండేదని అంటున్నారు.  ఈ విషయంలో పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయ్యిందనే వాదనలు ఆ పార్టీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

 

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×