E-Paper
Advertisement

Yoga Mahotsav: యోగా మహోత్సవ్.. 25 డేస్ కౌంట్‌డౌన్..

Yoga Mahotsav: యోగా మహోత్సవ్.. 25 డేస్ కౌంట్‌డౌన్..
Advertisement
yoga mahotsav

Yoga Mahotsav 2023 Hyderabad(Telangana today news): జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. 25 రోజుల కౌంట్ డౌన్‌తో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం మార్చి 13 నుంచి 100 రోజులపాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే చివరి 25 రోజుల కౌంట్‌డౌన్‌కి సూచికగా హైదరాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు.. కేంద్రమంత్రులు సర్బానంద సోనోవాల్, ముంజపరా మహేంద్రభాయ్ కాళూభాయ్ పాల్గొన్నారు.

అంతకుముందు 100 రోజుల కౌంట్‌డౌన్ ఈవెంట్ న్యూఢిల్లీలో, 75 రోజుల మహోత్సవం అసోమ్‌లోని దిబ్రూఘర్‌లో, 50వ రోజు కౌంట్‌డౌన్‌ జైపూర్‌లో జరిగింది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×