E-Paper
Advertisement

Midday Meal Scheme AP: వారానికో స్కూల్లో ఎమ్మెల్యేల భోజనం.. టీచర్లే మొదట రుచి చూడాలి: మంత్రి లోకేష్

Midday Meal Scheme AP: వారానికో స్కూల్లో ఎమ్మెల్యేల భోజనం.. టీచర్లే మొదట రుచి చూడాలి: మంత్రి లోకేష్
Advertisement

Midday Meal Scheme AP: ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పథకం అమలు తీరుపై కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డించే భోజనం రుచి శుచి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

మైలవరం పాఠశాలలో భోజనం బాగాలేదంటూ విద్యార్థులతో డ్రామా ఆడించిన హెడ్ మాస్టర్ ఉదంతాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పథకంపై కుట్రలు చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతిరోజూ పాఠశాలలో భోజనం సిద్ధం కాగానే విద్యార్థులకు వడ్డించకముందే ఒక ఉపాధ్యాయుడు రుచి చూడాలని ఆదేశించారు. ఉపాధ్యాయుడు భోజనం నాణ్యతను నిర్ధారించిన తర్వాతే పిల్లలకు అందజేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచడం ద్వారా లోపాలను సరిదిద్దవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పుల కోసం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల రాష్ట్రమంతటా ఒకే రకమైన నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా సామాజిక బాధ్యతగా వారం రోజుల్లో తమ నియోజకవర్గంలోని ఏదో ఒక పాఠశాలను సందర్శించి పిల్లలతో కలిసి భోజనం చేయాలని కోరారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉంటే వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పథకంపై తల్లిదండ్రులు కూడా నిరంతరం నిఘా ఉంచాలని లోకేష్ పిలుపునిచ్చారు. పిల్లలు చెప్పే అభిప్రాయాలను బట్టి తల్లిదండ్రులు ‘లీప్’ (LEAP) యాప్ ద్వారా తమ ఫీడ్‌బ్యాక్ లేదా ఫిర్యాదులను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతికతను జోడించడం ద్వారా సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించవచ్చని వివరించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అత్యుత్తమ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి పునరుద్ఘాటించారు.

Advertisement

Read Also: Lokesh Nara: స్కూల్ భోజనంపై విద్యార్థుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×