BigTV English

Nara Lokesh: జగన్ అహంకారం .. ప్రజల ఆత్మగౌరవం మధ్య యుద్దం ..

Nara Lokesh: జగన్ అహంకారం .. ప్రజల ఆత్మగౌరవం మధ్య యుద్దం ..
Nara Lokesh speech

Nara Lokesh speech(Andhra Pradesh today news):

ఇది నవశకం యుద్ధం మొదలైంది.. తాడేపల్లి తలుపులు బద్దలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది. రాక్షస పాలనలో పోరాటం చేస్తే అది ఒక విప్లవం అవుతుంది. ఈ సభ విప్లవానికి నాంది అని అన్నారు . ఇక అవినీతి పాలనపై యుద్దం మొదలయ్యింది. “యువగళం.. మనగళం.. ప్రజాగళం. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు.. లోకేశ్‌ది అంబేడ్కర్‌ రాజ్యాంగం పౌరుషం. అంబేద్కర్ రాజ్యాంగానికి ..రాజారెడ్డి పొగరుకు ..యుద్దం జరగబోతుంది” యుద్దానికి అందరం సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.


ఇది యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమేనని అసలు ఆట ముందుందని నారా లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌ను చూస్తే జగన్‌ భయపడతారన్నారన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. విజనరీ అంటే చంద్రబాబు.. ప్రిజనరీ అంటే జగన్‌. జగన్‌ అరెస్టు అయితే రోజుకో స్కాము బయటపడేదని లోకేశ్ ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని జగన్‌ దెబ్బతీశారు. రూ.లక్ష కోట్లు దోచేసిన వ్యక్తి పేదవాడు అవుతారా..? అని లోకేశ్ ప్రశ్నించారు. జగన్‌ అహంకారం.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో జగన్ కి రుచి చూపాలని సభలో లోకేశ్ పిలుపునిచ్చారు . యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. అడుగడుగునా జగన్‌ విధ్వంసం కనిపించింది. రాజధానిని చంపి జగన్‌ రాక్షసానందం పొందారని మండిపడ్డారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడదాం మనం అందరం యుద్దానికి సిద్దం అవ్వాలని నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.


Related News

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Big Stories

×