E-Paper
Advertisement

Asaduddin Owaisi | కొత్త క్రిమినల్ చట్టాలతో పౌరుల స్వేచ్ఛకు ముప్పు : ఒవైసీ

Asaduddin Owaisi | కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త క్రిమినల్ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదిత కొత్త క్రిమినల్ చట్టాలు పోలీసులకు విస్తృత అధికారాలను కల్పిస్తాయని.. ఫలితంగా పౌర స్వేచ్ఛ, పౌర హక్కులకు భంగం కలుగుతుందని ఒవైసీ పేర్కొన్నారు.

Asaduddin Owaisi | కొత్త క్రిమినల్ చట్టాలతో పౌరుల స్వేచ్ఛకు ముప్పు : ఒవైసీ
Advertisement

Asaduddin Owaisi | కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త క్రిమినల్ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదిత కొత్త క్రిమినల్ చట్టాలు పోలీసులకు విస్తృత అధికారాలను కల్పిస్తాయని.. ఫలితంగా పౌర స్వేచ్ఛ, పౌర హక్కులకు భంగం కలుగుతుందని ఒవైసీ పేర్కొన్నారు.

ప్రతిపాదిత మూడు క్రిమినల్ చట్టాలతో దేశంలోని దళితులు, ఆదివాసీలు, ముస్లింలకు ముప్పు పొంచిఉందని ఆయన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లోక్ సభలో కొత్త క్రిమినల్ చట్టాలపై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

”ఇప్పటికే దేశవ్యాప్తంగా జైళ్లలో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలో 33 శాతం మంది ముస్లింలు మగ్గుతున్నారు” అని ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్త క్రిమినల్ చట్టాలలో చాలా ప్రమాదకరమైన నిబంధనలు ఉన్నాయని.. పోలీసులకే న్యాయనిర్ణేతులుగా మారేందుకు కొత్త చట్టాలు అధికారాలు కల్పిస్తున్నాయని మండిపడ్డారు. దేశ ద్రోహం చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెబుతూ.. అదే చట్టాన్ని మరో రూపంలో తీసుకొస్తున్నారని చెప్పారు. పైగా కొత్త దేశ ద్రోహం చట్టం కింద కనీస జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచారని పేర్కొన్నారు.

అత్యాచారం నేరాన్ని లింగ భేదానికి అతీతంగా చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు.

Advertisement

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×