E-Paper
Advertisement

Shiva Temple: బాలుడి కలలో శివుడి దర్శనం.. నాగుపాము పుట్టలో శివలింగం

Shiva Temple: బాలుడి కలలో శివుడి దర్శనం.. నాగుపాము పుట్టలో శివలింగం
Advertisement

Shiva Temple: మూడు నెలలుగా ఆ బాలుడికి కలలో శివుడు కనిపిస్తున్నాడు. గ్రామానికి సమీపంలోని ఓ ప్రాంతంలో ఉన్న పుట్టలో తాను కొలువై ఉన్నానని, తీసుకొచ్చి పూజలు చేయాలని కలలో శివుడు చెప్తున్నాడని ఓ బాలుడు గ్రామస్థులతో చెప్పాడు. అయితే గ్రామస్థులు బాలుడి మాటలు పట్టించుకోలేదు. చివరకు కొందరు వ్యక్తులతో కలిసి గ్రామ సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లాడు. అక్కడ నాగు పాము కనిపించడంతో వెనక్కి వచ్చేశాడు. ఆ మరుసటి రోజు మళ్లీ వెళ్లి పుట్టను తవ్వగా.. అక్కడ శివ లింగం ఆకృతిలో ఉన్న శిల్పం దొరికింది. ఆ శివ లింగాన్ని తన ఇంటికి తీసుకొచ్చాడు బాలుడు. ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో శివ లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఈ ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది.

బాలుడి కలలో శివుడు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నాగేంద్ర అనే బాలుడికి గత మూడు నెలలుగా శివుడు కలలో కనిపిస్తున్నాడని చెప్తున్నాడు. తాను పలానా చోట పుట్టలో ఉన్నానని శివుడు తన కలలో చెప్పాడని బాలుడు గ్రామస్థులతో అంటున్నాడు. అయితే బాలుడు చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎవరూ నమ్మలేదు. ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితం ఒకరిద్దరు గ్రామస్థులను ఒప్పించి గ్రామానికి 3 కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న పుట్ట వద్దకు తీసుకెళ్లాడు బాలుడు. అయితే ఆ పుట్ట వద్ద పాము కనిపించడంతో భయపడి వెనక్కి వచ్చేశారు.

Advertisement

పుట్టలో శివలింగం

తిరిగి మళ్లీ సోమవారం వారు పుట్ట వద్దకు వెళ్లి, పుట్టను తవ్వగా అందులో శివలింగం కనిపించింది. దానిని పులికల్లు ఎస్టీ కాలనీకి తీసుకొచ్చారు. తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో మూడు వైపులా సిమెంట్ ఇటుకలు పేర్చి, పైన సిమెంట్ అచ్చు ఉంచి చిన్న నిర్మాణాన్ని సిద్ధం చేశాడు. దానినే గుడి భావించి అందులో శివ లింగాన్ని ఉంచాడు. తనకు వచ్చిన విధంగా పూజలు చేశాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి విగ్రహాన్ని చూడడానికి పలువురు భక్తులు వస్తున్నారు. విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. బాలుడి భక్తి శ్రద్ధలను అభినందిస్తున్నారు.

Advertisement

Also Read: PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×