E-Paper
Advertisement

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!
Advertisement

Nellore Accident: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై రాచర్లపాడు వద్ద రాత్రివేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్‌ను వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతులను ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లాలోని రాంనగర్ గ్రామానికి చెందిన శీతాకాంత్ (23), బాదల్ మహలిక్ (24)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ స్థానిక బి.ఎమ్.ఆర్ హేచరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Advertisement

అందరినీ తీవ్రంగా కలచివేసిన విషయమేమిటంటే… మృతుల్లో ఒకరైన బాదల్ మహలిక్ పుట్టినరోజు రోజే ఈ విషాదం చోటుచేసుకోవడం. బర్త్‌డే వేడుకల కోసం రాజుపాలెంలో కేక్ తీసుకుని, తిరిగి బి.ఎమ్.ఆర్ హేచరీకి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. సంతోషంగా కేక్ కట్ చేయాల్సిన సమయంలో విధి ఆడిన వింత నాటకానికి ఇద్దరు యువకుల నూరేళ్ల జీవితాలు బాటలోనే ముగిసిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: వీడేవడండీ బాబోయ్! ముసలిని భుజంపై మోసుకెళ్తున్నాడు.. వీడియో వైరల్!

Tags

Related News

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్

భోగాపురం ఎయిర్‌పోర్టుపై చర్చకు సిద్దమా.. జగన్‌‌కు మంత్రి పెమ్మసాని సవాల్!

ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!

Big Stories

Advertisement
×