E-Paper
Advertisement

Parakamani Case: సతీష్ కుమార్ మృతిని వైసీపీ మాత్రమే ఆత్మహత్యగా చిత్రీకరిస్తుంది: ఆళ్లపాటి రాజా

Parakamani Case: సతీష్ కుమార్ మృతిని వైసీపీ మాత్రమే ఆత్మహత్యగా చిత్రీకరిస్తుంది: ఆళ్లపాటి రాజా

Parakamani Case: టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చాలా బాధకరమని టీడీపీ ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజా అన్నారు. సతీష్ కుమార్ మృతిని వైసీపీ వాళ్లు మాత్రమే ఆత్మహత్య గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సతీష్ కుమార్, టీటీడీ ఉద్యోగి రవికుమార్ మధ్య ఎలా రాజీ కుదిర్చారు, టీటీడీ డబ్బులు పోతే కాంపౌండబుల్ అఫెన్స్ గా ఎలా మార్చి, రాజీ చేశారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కల్తీ మలినం పోకముందే పరకామణి ఇష్యూ బయటకు వచ్చిందన్నారు.

వైసీపీ ఎంత దారుణాన్ని ఒడిగట్టేందుకు అయినా వెనుకాడదని ఆళ్లపాటి రాజా ఆరోపించారు. అసలు కర్త, కర్మ, క్రియా ఎవరనే విషయం బయటకు తెచ్చేందుకే హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశించిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటి భయటకు వస్తున్నాయన్నారు.

పరకామణి కేసులో కీలక వ్యక్తి

టీటీడీ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడికి ఉన్న సీఐ సతీష్ కుమార్ ఇటీవల తాడిపత్రిలో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. రైలు పట్టాల సమీపంలో సతీష్ కుమార్ విగతజీవిగా పడిఉన్నారు. పరకామణి కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించడంతో.. విచారణ వేగవంతం అయింది. ఈ దశలో ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది.

సీసీ కెమెరాల ఆధారంగా

టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం వేశారు. సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కే ముందు ఓ టీ స్టాల్ లో టీ తాగినట్టు గుర్తించారు. ఆ సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. అప్పటికి సతీష్ కుమార్ మొహంలో ఎలా ఆందోళన కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. ట్రైన్ లో ఏం జరిగి ఉంటుందనే దానిపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ట్రైన్ లో A1,A2,A3 బోగీల్లో ఉన్న ప్యాసింజర్ లిస్ట్ ను పోలీసులు సేకరిస్తున్నారు. ఆ ప్యాసింజర్స్ లో ఎవరైనా నేర చరిత్ర ఉన్నవారు ఉన్నారా? అన్న దానిపై విచారణ చేస్తున్నారు.

Also Read: Satish Kumar Murder Case: సతీష్ కుమార్ హత్యపై డొంక కదిలింది.. గుట్టు అంతా ఫోన్ కాల్స్‌లో

A1 బోగీలో సీట్ నెంబర్ 21లో ఉండాల్సిన సతీష్ లగేజ్ సీట్ నెంబర్ 11 లోకి ఎలా వచ్చిందనే దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. లగేజీ ఆ సీట్లో ఎందుకు ఉందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సతీష్ ఫోన్ కాల్ లిస్ట్ ను పరిశీలిస్తున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×