E-Paper
Advertisement

Pawan Kalyan: వాహ్ పవన్ కళ్యాణ్.. ఇది కదా రాజకీయ హుందాతనం

Pawan Kalyan: వాహ్ పవన్ కళ్యాణ్.. ఇది కదా రాజకీయ హుందాతనం
Advertisement

Pawan Kalyan: రాజకీయంగా హుందాతనం ప్రదర్శించడం అంటే ఇదేనేమో..! రాజకీయ పరంగా ఎంతటి తీవ్ర విభేదాలున్నా, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడమే నిజమైన ప్రజాస్వామ్య రాజకీయాల లక్షణమని ఆయన తన చర్యల ద్వారా నిరూపించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు చేశారు.

రాజకీయ వేదికలపై పవన్ కళ్యాణ్, జగన్ మధ్య విమర్శలు, ఆరోపణలు కొత్తేమీ కాదు. అధికార, ప్రతిపక్ష పాత్రల్లో ఉన్నప్పుడు విధానాలపై, పరిపాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అయితే అవన్నీ రాజకీయ సిద్ధాంతాలకు, పాలనకు సంబంధించినవే తప్ప వ్యక్తిగత ద్వేషంతో కాదని పవన్ కళ్యాణ్ తన తాజా పోస్టుతో పరోక్షంగా స్పష్టం చేశారు. జగన్‌కు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Advertisement

ఈ తరుణంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన శుభాకాంక్షల సందేశం వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్టీలు వేరైనా తమ అభిమాన నటుడు మంచితనం నిరూపించుకున్నారని అనుకుంటున్నారు. విబేధాలు రాజకీయంగానే తప్ప వ్యక్తగతంగా కాదనే సందేశాన్ని ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత్రికి ఇదే విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారనే విషయాన్ని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

వైయస్ జగన్ నేడు తన జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పార్టీ కార్యాలయాల వద్ద, జిల్లాల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.

Advertisement

Also Read: జగన్ పుట్టినరోజు నేడు.. బెడిసికొట్టిన నేతల ప్లాన్, విమానంలో ‘షో’, ఏం జరిగింది?

జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×