E-Paper
Advertisement

Pawan Kalyan : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లిస్తారా?.. పవన్ ఫైర్..

Pawan Kalyan : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లిస్తారా?.. పవన్ ఫైర్..
Advertisement

Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వ విధానాలపై జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై మంగళగిరిలో పార్టీ ఆఫీస్ లో రౌండటేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో జగన్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలను తప్పుపట్టారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌ కేటాయింపులు జరగాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు 22 శాతం ఉన్నా.. ఇంకా నిధులు ఇవ్వాలని అడగాలా? దేహి అంటే కుదరదు.. పోరాటం చేసే తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సంపూర్ణంగా అమలు జరగాలని జనసేనాని స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందన్నారు. ఈ మూడేళ్లలో రూ.20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలి? అని మండిపడ్డారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా? ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. వైసీపీ రంగుల కోసం రూ.21,500 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా? అని పవన్‌ కల్యాణ్ నిలదీశారు.

Advertisement

వివక్షకు గురయ్యే కులాలను అర్థం చేసుకోవాలన్నారు జనసేనాని. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని పేర్కొన్నారు. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని వివరించారు. సమాజాన్ని సమగ్రంగా చూడాలన్నారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలని స్పష్టం చేశారు.

బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులను కనిపెట్టాలన్నారు పవన్. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే తన తపనని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడు అన్నారు. వ్యక్తి ఆరాధన ప్రమాదకరమ‌ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×