E-Paper
Advertisement

Pawan Kalyan Ippatam Visit: నాన్న నువ్వు 10 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి.. పవన్ కళ్యాణ్‌తో ఇండ్ల నాగేశ్వరమ్మ

Pawan Kalyan Ippatam Visit: నాన్న నువ్వు 10 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి.. పవన్ కళ్యాణ్‌తో ఇండ్ల నాగేశ్వరమ్మ

Pawan Kalyan Ippatam Visit: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాజకీయ నాయకుడిగా.. మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఆయన పర్యటించారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్‌ కల్యాణ్‌ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరింది. ఆమెకు ఇచ్చిన మాట మేరకు పవన్‌ కల్యాణ్‌ ఇప్పటం వచ్చారు.

ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు గ్రామస్థులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

పవన్‌ను  చూసిన వెంటనే నాగేశ్వరమ్మ భావోద్వేగానికి లోనై, నాన్నా.. నువ్వు 10 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి అంటూ ఆశీర్వదించారు. దీనికి ప్రతిస్పందనగా పవన్ కళ్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

ఇండ్ల నాగేశ్వరమ్మతో మాట్లాడిన సందర్భంగా.. పవన్ కళ్యాణ్ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. నాగేశ్వరమ్మకు రూ.50 వేల సాయం, ఆమె మనవడికి రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించి అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత తన కోసం పవన్ కళ్యాణ్ రావడం చాలా సంతోషంగా ఉందని నాగేశ్వరమ్మ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. “వన్ కళ్యాణ్ నా బంగారం.. నాకు దేవుడు. ఆయన సీఎం కావాలనేది నా కోరిక అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కారణంతోనే.. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు జరిగాయన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గ్రామానికి వచ్చి బాధితులకు ధైర్యం చెప్పడం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మళ్లీ రావడం ఆయన రాజకీయ శైలిని స్పష్టంగా చూపిస్తోంది. ప్రజల సమస్యలను ఎన్నికల వరకే పరిమితం చేయకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గుర్తుంచుకోవడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: వైఎస్ జగన్‌కు అనారోగ్యం.. నేటి కార్యక్రమాలు రద్దు

ఇప్పటం పర్యటన పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా కీలక మలుపుగా మారింది. అధికారంలోకి వచ్చాక ప్రజలను మరిచిపోని నాయకుడిగా ఆయన చేసిన ఈ ప్రయాణం, రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రస్థానానికి మరింత బలాన్నిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×