BigTV English
Advertisement

Payyavula Keshav: జగన్ ఢిల్లీకి వెళ్లింది అందుకోసమే.. ? : మంత్రి పయ్యావుల

Payyavula Keshav: జగన్ ఢిల్లీకి వెళ్లింది అందుకోసమే.. ? : మంత్రి పయ్యావుల

Payyavula Keshav comments on Jagan(Andhra politics news): ఇండియా కూటమి నేతలతో చర్చలు జరిపేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్‌కు దమ్ముంటే హత్యలకు సంబంధించిన వివరాలను బయట పెట్టాలని అన్నారు. బయట చెబుతున్న విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు.


ప్రజలు జగన్‌కు ఓట్లు వేసి.. 11 సీట్లు ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసమని అన్నారు. కానీ జగన్ సింగిల్ కెమరాలతో ప్రెస్ మీట్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అభిమానులు, అవమానించేవారు ఉండటం సహజమని అన్నారు. అభిమానించినా, అవమానించినా నిలదోక్కుకున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలన్న విషయాన్ని గ్రహించాలని జగన్‌కు హితవు పలికారు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే 11 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా ఒంటరిగా మిగిలిపోతారని అన్నారు.

ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేని సభలో చేతులెత్తేసిన జగన్.. ప్రతపక్ష హోదా కావాలని కోర్టులో అడుగుతున్నారని అన్నారు. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీలో అడుగుతున్నారని విమర్శించారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీకి వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా.. అని తెలిపారు. శ్వేతపత్రంలో చూపించిన విధంగా రూ. 9.30 లక్షల కోట్ల అప్పు కచ్చితంగా పెరుగుతుందని తెలిపారు.


Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×