E-Paper
Advertisement

Montha Politics: ఫేక్ ఫెలోస్ అంటూ మండిపడ్డ సీఎం.. ఏపీలో మొంథా రాజకీయం

Montha Politics: ఫేక్ ఫెలోస్ అంటూ మండిపడ్డ సీఎం.. ఏపీలో మొంథా రాజకీయం

ఏపీలో తుఫాన్ రాజకీయం మొదలైంది. ఓవైపు సీఎం చంద్రబాబు రెండ్రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా సచివాలయంలోనే మకాం వేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు తుఫాన్ సహాయక చర్యలు నిల్, ప్రభుత్వం ఫెయిల్ అంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఫేక్ ఫెలోస్ అంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. దీనికి కూడా వైసీపీ కౌంటర్ రెడీ చేసుకుంది.

రంగంలోకి టీడీపీ నేతలు..
మొంథా తుఫాన్ విషయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. తుఫాన్ కి రెండు రోజుల ముందు నుంచీ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఆర్టీజీ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. అటు స్థానిక నేతలు, కార్యకర్తల్ని నేరుగా రంగంలోకి దింపారు. అధికారులతోపాటు ఈసారి టీడీపీ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.

చంద్రబాబు ఆగ్రహం..
ఏపీ ప్రజల అదృష్టం బాగుండి తుఫాన్ వల్ల పెద్ద నష్టం జరగలేదు. అయితే ఈసారి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని పూర్తిగా తగ్గించలిగామని చెప్పుకుంటోంది ప్రభుత్వం. కానీ పంట నష్టం మాత్రం తప్పలేదు. తుఫాన్ తీరం దాటిన తర్వాత సీఎం చంద్రబాబు జనంలోకి వచ్చారు. రైతుల్ని పరామర్శించారు, వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాలకు వెళ్లారు.

ఈ క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన వద్ద ప్రస్తావించగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. “పీపుల్ ఆర్ హ్యాపీ, దీస్ ఫేక్ ఫెలోస్ ఆర్ నాట్ హ్యాపీ” అని మండిపడ్డారు.

వైసీపీ విమర్శలు..
మొంథా తుఫాన్ విషయంలో వైసీపీ ఆచితూచి విమర్శలు మొదలు పెట్టింది. సీఎం, డిప్యూటీ సీఎం అడ్రస్ లేరని మొదట్లో సాక్షిలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత నేతలంతా సమీక్షలకే పరిమితం అయ్యారని, క్షేత్ర స్థాయిలో ఎవరూ లేరని విమర్శలు చేశారు. తీరా ఇప్పుడు అధికారులు బాగా పనిచేశారని, నాయకులు మాత్రం ప్రమోషన్లు, ఎలివేషన్లు అంటూ కెమెరాల ముందుకొచ్చారని అంటున్నారు. తుఫాన్ వల్ల ప్రాణ నష్టం జరక్కుండా చూశామని ప్రభుత్వం చెబుతుంటే, ప్రతిపక్ష వైసీపీ విమర్శలకు కారణాలు పోగు చేసుకుంటోందని టీడీపీ నేతలంటున్నారు.

తుఫాన్ రాజకీయం..
తుఫాన్ తీరం దాటిన తర్వాత ఏపీలో రాజకీయ తుఫాన్ అలజడి రేపుతోంది. తుఫాన్ విషయంలో ఇటూ కూటమి, అటు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బాధితులు కూడా పార్టీల పరంగా విడిపోయారనే విషయం అర్థమవుతోంది. ప్రభుత్వ సేవలు అద్భుతం అని కొనియాడేవారి వీడియోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.

అదే సమయంలో తమను నాయకులు పట్టించుకోలేదనే వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తమ్మీద ఈసారి తుఫాన్ కాస్త ప్రశాంతంగానే తీరం దాటిందని తెలుస్తోంది. ప్రాణ నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా నివారించినట్టు తెలుస్తోంది. పంట నష్టం మినహా, మిగతా ఆస్తి నష్టాన్ని కూడా కనిష్టానికి పరిమితం చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.

Also Read: కూలిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు, అరిష్టం తప్పదా?

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×