E-Paper
Advertisement

Veera Brahmendra Swamy: వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిన ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్

Veera Brahmendra Swamy: వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిన ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్
Advertisement

Veera Brahmendra Swamy: వైఎసార్ఆర్ కడప జిల్లాలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు, ఆ విషయంలో అలసత్వం వహించారని భక్తులు మండిపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్నప్పుడు మరమ్మతులు చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.

తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిన ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని కడప కలెక్టర్‌ను అదేశించారు. ‘‘శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి పూర్వీకుల ఇంటిని పునరుద్ధరించడానికి, మన సాంస్కృతిక వారసత్వంలోని ఈ విలువైన భాగాన్ని కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను అభ్యర్థిస్తున్నాను’’ అని ట్వీట్ లో లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

Read Also: కూలిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 400 ఏళ్ల నాటి ఇల్లు, అరిష్టం తప్పదా?

ప్రపంచవాప్తంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు తెలియని వారుండరు. 400 ఏళ్ల క్రితమే రాబోయే భవిష్యత్తులో తలెత్తే మార్పులు, విపత్తులు, వింతల గురించి తన కాల‌జ్ఞానం పుస్తక రచనలో వెల్లడించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన అనేక సంఘటనలు అనంతర కాలంలో నిజమవుతూ రావడంతో ఆయన కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి నివసించిన ఇల్లు,  ఇప్పుడు మొంథా వర్షాల దాటికి కుప్పకూలటం భక్తులలో తీవ్ర ఆవేదనను రేపుతోంది.

Advertisement

మంత్రి లోకేష్ ట్వీట్‌తో జిల్లా కలెక్టర్ స్పందన ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఈ వారసత్వ సంపదను కాపాడుకోవడానికి నిధులు కేటాయిస్తుందా?.. లేదా ట్వీట్‌కే పరిమితం అవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరబ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పడం కాదని ఇకనైనా బ్రహ్మంగారి మఠంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

 

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×