E-Paper
Advertisement

AP News :ఫైన్ వేస్తే పవర్ కట్.. పోలీస్ వర్సెస్ లైన్‌మెన్..

AP News :ఫైన్ వేస్తే పవర్ కట్.. పోలీస్ వర్సెస్ లైన్‌మెన్..
Advertisement
AP News

AP News : ఇది ఖతర్నాక్ న్యూస్. అనగనగా ఓ లైన్‌మెన్. బండి మీద వెళ్తున్నాడు. సడెన్‌గా పోలీసులు అతని బండిని ఆపేశారు. లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ చూపించమన్నారు. ఇతనేమో తాను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని బిల్డప్ ఇచ్చాడు. విద్యుత్ శాఖలో ఉద్యోగినని వదిలేయమని అడిగాడు. పోలీసులతో ఎంతగా వాగ్వాదం చేసినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. అసలే పోలీసోళ్లు. వేరే డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను లెక్క చేస్తారా? అందుకే, ఇలాంటి పప్పులేవీ ఉడకవంటూ.. సరైన పత్రాలు లేవంటూ ఫైన్ వేసేశారు.

ఆ లైన్‌మెన్‌కు ఒళ్లు మండింది. తన బండికే ఫైన్ వేస్తారా? ఉండండి మీ సంగతి చెబుతా? అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎలాగైనా ఆ పోలీసులకు షాక్ ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. తన పరిధిలో పోలీస్ హెల్ప్‌డెస్క్ స్టేషన్ ఉంది. దీంతో, నేరుగా కరెంట్ పోల్ ఎక్కి.. ఆ హెల్ప్ డెస్క్‌కు పవర్ కట్ చేసి పడేశాడు ఆ లైన్‌మెన్.

Advertisement

కరెంట్ లేక, ఎంతకీ రాక.. పోలీస్ హెల్ప్ డెస్క్ సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. అసలేమైందని కనుక్కుంటే.. అసలు విషయం ఆ తర్వాత తెలిసింది. ఆ విద్యుత్ శాఖ ఉద్యోగిపై మండిపడుతున్నారు పోలీసులు. పార్వతీపురంలో జరిగిందీ ఘటన.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×