E-Paper
Advertisement

Prudhvi PR Diary : “చాలా నష్టపోయాను.. వైసీపీ నేతల చిట్టా అంతా బయటపెడతా”

Prudhvi PR Diary : “చాలా నష్టపోయాను.. వైసీపీ నేతల చిట్టా అంతా బయటపెడతా”
Advertisement

Prudhvi PR Diary : టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ బాబు దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లుగానే తన వద్ద కూడా ఓ పీఆర్ డైరీ ఉందని సినీ నటుడు పృథ్వీ ఆసక్తికర వాఖ్యలు చెశారు. వైసీపీ నేతల జాతకం ఏంటనేది పృథ్వీ రాజ్ డైరీలో చిట్టా విప్పుతానని తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన రెండు జెండాల కలయిక అద్భుతమన్నారు. ఇది మార్పుకు శుభసూచికమని తెలిపారు. అలాగే ఏపీలో 130 స్థానాలతో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

పీఆర్ డైరీలో తనకు సంబంధించినవన్నీ రాశానని చెప్పుకొచ్చారు పృథ్విరాజ్. పార్టీ ప్రచారాలకు వెళ్లి.. సుమారు రూ.90 నుంచి 95 లక్షల వరకూ నష్టపోయానన్నారు. తనను మోసం చేసిందెవరో, దుర్మార్గులెవరో, లేనిపోనివిధంగా దుర్భాషలాడిందెవరో, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు ? గెలిచినపుడు అభ్యర్థుల ఆస్తులెంత? ఇప్పుడెంత ఆస్తులున్నాయి? అనే విషయాలన్నింటిపై తానొక డైరీ రాసుకున్నానని తెలిపారు. ఒక్కొక్కరోజు.. ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రచారం చేసేటపుడు, డైరీలోని విషయాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని నటుడు పృథ్విరాజ్ తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ.. అందరి జాతకాలు తన డైరీలో ఉన్నాయన్నారు.

Advertisement

రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి నాంది అయిన.. తెలుగుదేశం – జనసేనలతో కలిసే తాను నడుస్తానని అన్నారు. ఆ రెండు పార్టీలు వదిలిన బాణమే తాను అని, తనను పోటీచేయమని చెబితే చేస్తా.. లేదంటే పార్టీల వెంటే తన ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా పృథ్విరాజ్ స్పష్టం చేశారు. త్వరలోనే జనసేన పార్టీలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకుని చేరుతానని తెలిపారు.

.

Advertisement

.

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×