E-Paper
Advertisement

Prudhvi PR Diary : “చాలా నష్టపోయాను.. వైసీపీ నేతల చిట్టా అంతా బయటపెడతా”

Prudhvi PR Diary : “చాలా నష్టపోయాను.. వైసీపీ నేతల చిట్టా అంతా బయటపెడతా”
Advertisement

Prudhvi PR Diary : టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ బాబు దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లుగానే తన వద్ద కూడా ఓ పీఆర్ డైరీ ఉందని సినీ నటుడు పృథ్వీ ఆసక్తికర వాఖ్యలు చెశారు. వైసీపీ నేతల జాతకం ఏంటనేది పృథ్వీ రాజ్ డైరీలో చిట్టా విప్పుతానని తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన రెండు జెండాల కలయిక అద్భుతమన్నారు. ఇది మార్పుకు శుభసూచికమని తెలిపారు. అలాగే ఏపీలో 130 స్థానాలతో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

పీఆర్ డైరీలో తనకు సంబంధించినవన్నీ రాశానని చెప్పుకొచ్చారు పృథ్విరాజ్. పార్టీ ప్రచారాలకు వెళ్లి.. సుమారు రూ.90 నుంచి 95 లక్షల వరకూ నష్టపోయానన్నారు. తనను మోసం చేసిందెవరో, దుర్మార్గులెవరో, లేనిపోనివిధంగా దుర్భాషలాడిందెవరో, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు ? గెలిచినపుడు అభ్యర్థుల ఆస్తులెంత? ఇప్పుడెంత ఆస్తులున్నాయి? అనే విషయాలన్నింటిపై తానొక డైరీ రాసుకున్నానని తెలిపారు. ఒక్కొక్కరోజు.. ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రచారం చేసేటపుడు, డైరీలోని విషయాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని నటుడు పృథ్విరాజ్ తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ.. అందరి జాతకాలు తన డైరీలో ఉన్నాయన్నారు.

Advertisement

రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి నాంది అయిన.. తెలుగుదేశం – జనసేనలతో కలిసే తాను నడుస్తానని అన్నారు. ఆ రెండు పార్టీలు వదిలిన బాణమే తాను అని, తనను పోటీచేయమని చెబితే చేస్తా.. లేదంటే పార్టీల వెంటే తన ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా పృథ్విరాజ్ స్పష్టం చేశారు. త్వరలోనే జనసేన పార్టీలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకుని చేరుతానని తెలిపారు.

.

Advertisement

.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×