E-Paper
Advertisement

AP: 16సార్లు కత్తితో పొడిచి.. లవర్‌ను దారుణంగా చంపిన ఉన్మాది..

AP: 16సార్లు కత్తితో పొడిచి.. లవర్‌ను దారుణంగా చంపిన ఉన్మాది..
Advertisement

AP: ఈ అబ్బాయిలకు ఏమైంది? ఎందుకిలా ఉన్మాదులుగా మారుతున్నారు? ప్రేమించలేదని ఒకడు.. పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఇంకోడు.. కోరిక తీర్చలేదని మరొకడు.. మనుషులా? రాక్షసులా? వరుస ఘటనలతో సమాజంలో ప్రేమికుల ముసుగులో దాగున్న సైతాన్‌లు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలుగువాళ్లలో ఇలాంటి పైశాచిక లక్షణాలు పెరుగుతుండటం ఆందోళనకరం.

ఈసారి బెంగళూరులో ఓ తెలుగు ప్రేమికుడు రెచ్చిపోయాడు. తనను ప్రేమించి, తనతో ఇన్నాళ్లూ కలిసుండి.. ఇప్పుడు వేరే వాడితో పెళ్లికి రెడీ అవుతోందనే కోపంతో.. ప్రేయసిని దారుణంగా పొడిచి చంపాడు. ఆఫీసు బయటే.. అందరూ చూస్తుండగానే.. కత్తితో కసాకసా 16సార్లు పొడిచేశాడు. మృగంలా ప్రవర్తించాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే…

Advertisement

కాకినాడకు చెందిన లీలా పవిత్ర(28). బెంగళూరులో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌తో ప్రేమలో పడింది. ఐదేళ్లుగా వాళ్లు డీప్‌గా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో.. తమ ప్రేమ గురించి పేరెంట్స్‌కు చెప్పేసింది లీలా. అందరిలానే ఆ తల్లిదండ్రులు వారి ప్రేమ, పెళ్లికి నో చెప్పారు. కుదరదంటే కుదరదని తేల్చి చెప్పేశారు. వెంటనే కూతురుకు వేరే సంబంధం కుదిర్చారు. పెద్దల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు లీలా పవిత్రకు.

ఇక చేసేదేముంది.. అందరిలానే ఆమె కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్దమైపోయింది. ఎప్పటిలానే ఆఫీసుకు వెళ్తోంది. అయితే, అక్కడ తన లవర్ దివాకర్‌తో మెళ్లగా దూరం జరగసాగింది. మునుపటిలో కలవడం లేదు.. కలిసి ఉండటం లేదు.. రెండు నెలలుగా దివాకర్‌ను మాగ్జిమమ్ అవాయిడ్ చేసింది లీలా.

Advertisement

ఆ దూరాన్ని దివాకర్ తట్టుకోలేకపోయాడు. ఆరా తీస్తే ఆమెకు వేరే వ్యక్తితో మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. ఆ విషయం భరించలేకపోయాడు. ఐదేళ్లుగా తనతో ఎంజాయ్ చేసి.. ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందా? అని కోపంతో రగిలిపోయాడు. ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

ఆఫీస్ అయిపోగానే.. బయటకు వచ్చిన లీలాపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు దివాకర్. మిగతా ఎంప్లాయిస్ అంతా చూస్తుండగానే.. ఆమెను విచక్షణారహితంగా పొడిచేశాడు. ఉన్మాదిలా ప్రవర్తించాడు. రక్తం ఓడుతున్నా.. లీలా అచేతనంగా పడిపోయినా.. ఆగలేదు ఆ సైకో. కత్తితో పదే పదే పొడిచాడు. అలా మొత్తం 16 పోట్లు పొడిచాడు.

ఎవరో పోలీసులకు ఫోన్ చేయగా.. వారు నిమిషాల వ్యవధిలోనే స్పాట్‌కు చేరుకున్నారు. ఉన్మాది దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాల పాలైన లీలా పవిత్రను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు పోలీసులు.

Related News

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×