E-Paper
Advertisement

AP: 16సార్లు కత్తితో పొడిచి.. లవర్‌ను దారుణంగా చంపిన ఉన్మాది..

AP: 16సార్లు కత్తితో పొడిచి.. లవర్‌ను దారుణంగా చంపిన ఉన్మాది..
Advertisement

AP: ఈ అబ్బాయిలకు ఏమైంది? ఎందుకిలా ఉన్మాదులుగా మారుతున్నారు? ప్రేమించలేదని ఒకడు.. పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఇంకోడు.. కోరిక తీర్చలేదని మరొకడు.. మనుషులా? రాక్షసులా? వరుస ఘటనలతో సమాజంలో ప్రేమికుల ముసుగులో దాగున్న సైతాన్‌లు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలుగువాళ్లలో ఇలాంటి పైశాచిక లక్షణాలు పెరుగుతుండటం ఆందోళనకరం.

ఈసారి బెంగళూరులో ఓ తెలుగు ప్రేమికుడు రెచ్చిపోయాడు. తనను ప్రేమించి, తనతో ఇన్నాళ్లూ కలిసుండి.. ఇప్పుడు వేరే వాడితో పెళ్లికి రెడీ అవుతోందనే కోపంతో.. ప్రేయసిని దారుణంగా పొడిచి చంపాడు. ఆఫీసు బయటే.. అందరూ చూస్తుండగానే.. కత్తితో కసాకసా 16సార్లు పొడిచేశాడు. మృగంలా ప్రవర్తించాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే…

Advertisement

కాకినాడకు చెందిన లీలా పవిత్ర(28). బెంగళూరులో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌తో ప్రేమలో పడింది. ఐదేళ్లుగా వాళ్లు డీప్‌గా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో.. తమ ప్రేమ గురించి పేరెంట్స్‌కు చెప్పేసింది లీలా. అందరిలానే ఆ తల్లిదండ్రులు వారి ప్రేమ, పెళ్లికి నో చెప్పారు. కుదరదంటే కుదరదని తేల్చి చెప్పేశారు. వెంటనే కూతురుకు వేరే సంబంధం కుదిర్చారు. పెద్దల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు లీలా పవిత్రకు.

ఇక చేసేదేముంది.. అందరిలానే ఆమె కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్దమైపోయింది. ఎప్పటిలానే ఆఫీసుకు వెళ్తోంది. అయితే, అక్కడ తన లవర్ దివాకర్‌తో మెళ్లగా దూరం జరగసాగింది. మునుపటిలో కలవడం లేదు.. కలిసి ఉండటం లేదు.. రెండు నెలలుగా దివాకర్‌ను మాగ్జిమమ్ అవాయిడ్ చేసింది లీలా.

Advertisement

ఆ దూరాన్ని దివాకర్ తట్టుకోలేకపోయాడు. ఆరా తీస్తే ఆమెకు వేరే వ్యక్తితో మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. ఆ విషయం భరించలేకపోయాడు. ఐదేళ్లుగా తనతో ఎంజాయ్ చేసి.. ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందా? అని కోపంతో రగిలిపోయాడు. ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

ఆఫీస్ అయిపోగానే.. బయటకు వచ్చిన లీలాపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు దివాకర్. మిగతా ఎంప్లాయిస్ అంతా చూస్తుండగానే.. ఆమెను విచక్షణారహితంగా పొడిచేశాడు. ఉన్మాదిలా ప్రవర్తించాడు. రక్తం ఓడుతున్నా.. లీలా అచేతనంగా పడిపోయినా.. ఆగలేదు ఆ సైకో. కత్తితో పదే పదే పొడిచాడు. అలా మొత్తం 16 పోట్లు పొడిచాడు.

ఎవరో పోలీసులకు ఫోన్ చేయగా.. వారు నిమిషాల వ్యవధిలోనే స్పాట్‌కు చేరుకున్నారు. ఉన్మాది దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాల పాలైన లీలా పవిత్రను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు పోలీసులు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×