E-Paper
Advertisement

Raghu Rama Krishna Raju : జగన్ బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్..

Raghu Rama Krishna Raju : జగన్ బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్..
Advertisement

Raghu Rama Krishna Raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా వైఎస్ జగన్‌ బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. జగన్‌ బెయిల్‌ రద్దు చేసి, అక్రమాస్తుల కేసులపై విచారణ వేగవంతం చేయాలని గతంలోనే తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ కూడా దాఖలు చేసింది. సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత రఘురామ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Advertisement

తెలంగాణ హైకోర్టు తీర్పును రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×