E-Paper
Advertisement

Sam Altman Returns : ఓపెన్ ఏఐ పగ్గాలు తిరిగి శామ్‌కే!

Sam Altman Returns : ఓపెన్ ఏఐ పగ్గాలు తిరిగి శామ్‌కే!
Advertisement

Sam Altman Returns : ఓపెన్ ఏఐలో రేగిన కల్లోలం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఎలాంటి నోటీసు లేకుండా తనకు ఉద్వాసన పలికిన బోర్డు‌రూం కుట్రలను ఛేదించి ఏఐ కింగ్ శామ్ ఆల్ట్‌మన్ సొంతగూటికి చేరుతున్నారు. ఆ సంస్థ సీఈవోగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. శామ్ తొలగింపును నిరసిస్తూ వైదొలగిన మాజీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మాన్ కూడా తిరిగి రానున్నారు.

శామ్ ను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా బోర్డు మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు సీఈవోలను మార్చింది. ఈ నేపథ్యంలో శామ్ పున:ప్రవేశానికి సూత్రప్రాయంగా ఓ ఒప్పందం కుదిరిందంటూ ఓపెన్ ఏఐ వెల్లడించింది. అలాగే కొత్త బోర్డుకు బ్రెట్ టేలర్ సారథ్యం వహిస్తారు. ఓపెన్ ఏఐను పునర్వ్యవస్థీకరించే బాధ్యత ముగ్గురు సభ్యులతో కూడిన కొత్త బోర్డు‌కు అప్పగించారు.

Advertisement

మొత్తం 9 మంది సభ్యులు ఉండేలా బోర్డును త్వరలో విస్తరిస్తారు. అందులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఓపెన్ ఏఐ‌లో అతి పెద్ద భాగస్వామి, పది బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. బోర్డు సభ్యునిగా కొనసాగాలని శామ్ ఆల్ట్‌మన్ కూడా కోరుకుంటున్నారు. అలాగే శామ్ ఉద్వాసనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. శామ్ తిరిగి రావడంపై ఓపెన్ ఏఐలో అతి పెద్ద పెట్టుబడిదారు త్రైవ్ కేపిటల్ స్వాగతించింది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×