E-Paper
Advertisement

Eluru News: ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్

Eluru News: ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్
Advertisement

Eluru News: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ భూతం తీవ్ర రూపం దాల్చుతోంది. దీనిబారిన పడిన విద్యార్థులు చివరకు ఫైటింగ్‌కు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఏలూరు మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశం చేసి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగింది?

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Advertisement

ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్‌లో మూడో ఇయర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. అంతేకాదు వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కొన్నాళ్లుగా ఈ ఘటన జరుగుతున్నా, విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టకుండా మౌనం వ్యవహరించారు.

అయితే రోజురోజుకూ సీనియర్ల ఆగడాలు శృతి మించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్‌కు దారి తీసింది. చివరకు 15 మంది సీనియర్లు తమను వేధిస్తున్నారని జూనియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్

సీనియర్లు చెప్పిన పనులు చేయకుంటే దాడులు చేస్తున్నారని వివరించారు. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ మధ్యకాలం మంగళగిరి ఎయిమ్స్‌లో ఈ తరహా వ్యవహారం చోటు చేసుకుంది.  దీంతో పలువురు విద్యార్థులను ఇంటికి పంపారు.  ఇప్పుడు ఏలూరు వంతైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ:  సీఎం చంద్రబాబు రిలీఫ్, ఆ కేసు మూసివేత

 

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×