Eluru News: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ భూతం తీవ్ర రూపం దాల్చుతోంది. దీనిబారిన పడిన విద్యార్థులు చివరకు ఫైటింగ్కు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఏలూరు మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశం చేసి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగింది?
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్లో మూడో ఇయర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. అంతేకాదు వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కొన్నాళ్లుగా ఈ ఘటన జరుగుతున్నా, విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టకుండా మౌనం వ్యవహరించారు.
అయితే రోజురోజుకూ సీనియర్ల ఆగడాలు శృతి మించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్కు దారి తీసింది. చివరకు 15 మంది సీనియర్లు తమను వేధిస్తున్నారని జూనియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు హాస్టల్కు చేరుకుని విచారణ చేపట్టారు.
అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్
సీనియర్లు చెప్పిన పనులు చేయకుంటే దాడులు చేస్తున్నారని వివరించారు. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ మధ్యకాలం మంగళగిరి ఎయిమ్స్లో ఈ తరహా వ్యవహారం చోటు చేసుకుంది. దీంతో పలువురు విద్యార్థులను ఇంటికి పంపారు. ఇప్పుడు ఏలూరు వంతైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: సీఎం చంద్రబాబు రిలీఫ్, ఆ కేసు మూసివేత
ఏలూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం..
అర్థరాత్రి సీనియర్లకు, జూనియర్లకు గొడవ
కొంతకాలంగా మూడో సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లు ఆరోపణ
15 మంది సీనియర్లు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన జూనియర్లు
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటున్న… pic.twitter.com/3N5GIp4ZGM
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2025