E-Paper
Advertisement

రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి!

రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి!

Harshaveena Assault Railway Koduru: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలుగా చెప్పుకుంటున్న హర్షవీణపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. గురువారం జరిగిన ఈ ఘటనలో జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు తనపై భౌతిక దాడికి దిగారని బాధితురాలు ఆరోపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాధితురాలు హర్షవీణ తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు గురువారం టీడీపీ (TDP) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు వెళ్లారు. అక్కడ టీడీపీ నాయకుడు ముక్కా రూపానందరెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ప్రజాదర్బార్ ముగిసిన కొద్దిసేపటికే ఆమెపై దాడి జరిగింది. “నన్ను ఎందుకు కొడుతున్నారు?” అని ఆమె ప్రశ్నించినా వినకుండా దుండగులు తనను హింసించారని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో తాను గళం విప్పడం వల్లే కావాలనే తనను టార్గెట్ చేశారని ఆమె పేర్కొన్నారు.

ఈ దాడి వెనుక జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరుల హస్తం ఉందని బాధితురాలు నేరుగా ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల నేతల మధ్యే ఇలాంటి వివాదాలు రావడం గమనార్హం. గత కొంతకాలంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు వ్యతిరేకంగా హర్షవీణ సోషల్ మీడియాలో మరియు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించారు.

తనపై జరిగిన దాడిపై హర్షవీణ రైల్వేకోడూరు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై జనసేన నాయకులు కానీ ఎమ్మెల్యే వర్గీయులు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Read Also: నేతన్నల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కల్వకుంట్ల కవిత విమర్శలు!

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×